Mukesh Ambani: గత 6 ఏళ్లుగా జీతం తీసుకోని ముఖేష్ అంబానీ.. అయినా సంపదలో రికార్డులు
- ఆసియాలో రెండవ అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ
- గత 6 ఏళ్లుగా జీతం తీసుకోని ముఖేష్ అంబానీ
- ముఖేష్ అంబానీ సంపదకు ప్రధాన కారణం జీతం కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియాలో రెండవ అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ గత ఆరు సంవత్సరాలుగా జీతం తీసుకోకపోయినా, సంపద మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఏర్పడిన ఆర్థిక, సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ నుంచి జీతం, అలవెన్సులు, బోనస్లు, పదవీ విరమణ ప్రయోజనాలు, స్టాక్ ఆప్షన్లు వంటి ఎలాంటి పారితోషికాన్ని కూడా స్వీకరించలేదు. ఇదే సమయంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.95,754 కోట్లకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ముఖేష్ అంబానీ జీతం ఎంత ఉండేది?
Also Read
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- 8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్పాట్!
ముఖేష్ అంబానీ గత ఆరు సంవత్సరాలుగా జీతం తీసుకోకపోయినా, అంతకుముందు వార్షిక జీతం రూ.15 కోట్లుగా ఉండేది. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచే తన జీతాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఆ తర్వాత రిలయన్స్ వ్యాపారం, లాభాలు భారీగా పెరిగినా కూడా అదే జీత పరిమితిని దాదాపు 12 సంవత్సరాల పాటు కొనసాగించారు.
జీతం తీసుకోకపోతే సంపాదన ఎలా?
ముఖేష్ అంబానీ సంపదకు ప్రధాన కారణం జీతం కాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్లో కుటుంబానికి ఉన్న భారీ వాటానే ఆస్తుల పెరుగుదలకు ప్రధాన ఆధారం. కంపెనీ షేర్ ధర పెరిగే కొద్దీ నికర సంపద కూడా పెరుగుతుంది. అంతేకాదు, ప్రధాన ఆదాయ వనరు డివిడెండ్లు.
కంపెనీ లాభాల్లో భాగంగా వాటాదారులకు డివిడెండ్ చెల్లిస్తుంది. రిలయన్స్లో ముఖేష్ అంబానీకి సుమారు 16.1 మిలియన్ షేర్లు ఉన్నట్లు సమాచారం. FY2025లో కంపెనీ ఒక్కో షేర్కు రూ.6 డివిడెండ్ ప్రకటించడంతో ఆయనకు సుమారు రూ.96.6 మిలియన్ల ఆదాయం వచ్చినట్లు అంచనా. అయితే, ఆదాయం (Income), నికర ఆస్తి విలువ (Net Worth) రెండూ వేర్వేరు అంశాలని గుర్తుంచుకోవాలి.
లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రిలయన్స్
Reliance Industries దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రముఖ సంస్థగా ఎదిగింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటి. గత ఏడాది రిలయన్స్ సంస్థ లక్ష మందికి పైగా కొత్త ఉద్యోగాలను కల్పించింది. దీంతో 2026 మార్చి 31 నాటికి సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,19,911కు చేరుకుంది. ఇక జామ్నగర్లో నిర్మాణంలో ఉన్న ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ ద్వారా మరో రూ.2 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!