Mukesh Ambani: రిలయన్స్కు ట్రంప్ ఎఫెక్ట్.. లక్ష కోట్లు లాస్ అయిన ముఖేష్ అంబానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: ఆసియాలో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. కొన్ని రోజులుగా మార్కెట్ ఆయన రష్యన్ ముడి చమురును కొనుగోలు చేశారా లేదా అనే సందిగ్ధతతో సతమతమవుతోంది. తాజాగా రష్యన్ ముడి చమురును మోసుకెళ్తున్న మూడు నౌకలు ప్రపంచంలోనే అతిపెద్ద శుద్ధి కర్మాగారమైన జామ్నగర్కు చేరుకున్నాయని కెప్లర్ను ఉటంకిస్తూ బ్లూమ్బెర్గ్ నివేదించింది. దీని తరువాత జనవరి 5న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యన్ ముడి చమురు కొనుగోలుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారతదేశం రష్యన్ ముడి చమురు కొనుగోలును ఆపకపోతే ఇండియాపై మరిన్ని సుంకాలను విధిస్తామని ఆయన తన ప్రకటనలో బెదిరించారు.
READ ALSO: Samsung మైండ్ బ్లోయింగ్ లాంచ్..CES 2026లో ‘Galaxy Book6’ సిరీస్..!
Also Read
- Smartphone Prices Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు షాక్.. చుక్కలు చూపిస్తున్న ధరలు! పండగ సీజన్లో కొత్త ఫోన్ల కొనుగోళ్లు డౌటే..
- RBI: బీ అలర్ట్.. రూ.500 నోట్లపై ఆర్బీఐ కీలక విషయం వెల్లడి..
- Bank Holidays in June 2026: జూన్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్!
- Colonel Sanders: 60 ఏళ్ల వయసులో రూ. 9 వేల పెన్షన్తో మొదలైన బిలియన్ డాలర్ల సామ్రాజ్యం.. కేఎఫ్సీ పెద్దాయన కథ ఇదే!
ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ట్విట్టర్ హ్యాండిల్లో రష్యన్ ముడి చమురు కొనుగోలుపై వివరణ జారీ చేసింది. గత మూడు వారాలుగా కంపెనీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయలేదని, జనవరిలో ముడి చమురు వచ్చే అవకాశం లేదని పేర్కొంది. అలాగే రిలయన్స్ రష్యన్ ముడి చమురు కొనుగోలు చేస్తుందనే అన్ని మీడియా నివేదికలను ఈ ప్రకటనలో తోసిపుచ్చారు. వాస్తవానికి ఈ వివరణ ఇప్పుడు ముఖేష్ అంబానీ కంపెనీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ కంపెనీ షేర్లు 5 శాతానికి పైగా పడిపోయాయి. ముఖ్యంగా జూన్ 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత రిలయన్స్ షేర్లలో అతిపెద్ద క్షీణతను ఇప్పుడే చవిచూశాయి. దీని ఫలితంగా రిలయన్స్ వాల్యుయేషన్ లక్ష కోట్ల రూపాయలకు పైగా పడిపోయింది. నిజానికి ఇది చిన్న సంఘటన కాదు. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పతనం మొత్తం స్టాక్ మార్కెట్ నష్టానికి దారితీసింది. సెన్సెక్స్ 485 పాయింట్లు పడిపోయింది.
మంగళవారం బిఎస్ఇలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లు 5% పడిపోయి రూ.1,497.05 కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. రష్యన్ ముడి చమురును మోసుకెళ్తున్న మూడు నౌకలు జామ్నగర్ శుద్ధి కర్మాగారానికి వెళ్తున్నాయని బ్లూమ్బెర్గ్ నివేదికను కంపెనీ తిరస్కరించిన తర్వాత ఈ క్షీణత సంభవించింది. బ్లూమ్బెర్గ్ నివేదికను రిలయన్స్ కంపెనీ “పూర్తిగా తప్పు” అని పేర్కొంది. జూన్ 4, 2024 తర్వాత ఇదే రిలయన్స్ స్టాక్ అతిపెద్ద క్షీణత. స్టాక్ దాని 50-రోజుల మూవింగ్ యావరేజ్ కంటే తక్కువకు పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ రోజు ఉదయం రూ.1,575.55 వద్ద ప్రారంభమైంది, అంతకుముందు రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ₹1,577.45 వద్ద ముగిశాయి. కానీ ఈ రోజు మధ్యాహ్నం 1:40 గంటలకు 4.69% తగ్గి ₹1,503.50 వద్ద ట్రేడవుతున్నాయి.
దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల క్షీణత కారణంగా, దాని విలువ రూ.1 లక్ష కోట్లకు పైగా తగ్గింది. BSE డేటా ప్రకారం సోమవారం కంపెనీ షేర్లు ముగిసినప్పుడు, దాని మార్కెట్ క్యాప్ ₹21,34,679.89 కోట్లుగా ఉండగా, మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఇది రూ.20,25,878.81 కోట్లకు పడిపోయింది. అంటే ట్రేడింగ్ రోజులో కంపెనీ రూ.1,08,801.08 కోట్లు కోల్పోయింది.
READ ALSO: Aman Rao Double Century: హైదరాబాద్ క్రికెటర్ ఊచకోత.. 13 సిక్స్లు, 12 ఫోర్లతో బౌలర్లకు చుక్కలు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్టైమ్ హిస్టరీ..
-
Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్పై కెప్టెన్ గిల్ రియాక్షన్
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
-
Gill Century Celebration: శుభ్మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..