Mukesh Ambani: రిలయన్స్కు ట్రంప్ ఎఫెక్ట్.. లక్ష కోట్లు లాస్ అయిన ముఖేష్ అంబానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: ఆసియాలో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. కొన్ని రోజులుగా మార్కెట్ ఆయన రష్యన్ ముడి చమురును కొనుగోలు చేశారా లేదా అనే సందిగ్ధతతో సతమతమవుతోంది. తాజాగా రష్యన్ ముడి చమురును మోసుకెళ్తున్న మూడు నౌకలు ప్రపంచంలోనే అతిపెద్ద శుద్ధి కర్మాగారమైన జామ్నగర్కు చేరుకున్నాయని కెప్లర్ను ఉటంకిస్తూ బ్లూమ్బెర్గ్ నివేదించింది. దీని తరువాత జనవరి 5న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యన్ ముడి చమురు కొనుగోలుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారతదేశం రష్యన్ ముడి చమురు కొనుగోలును ఆపకపోతే ఇండియాపై మరిన్ని సుంకాలను విధిస్తామని ఆయన తన ప్రకటనలో బెదిరించారు.
READ ALSO: Samsung మైండ్ బ్లోయింగ్ లాంచ్..CES 2026లో ‘Galaxy Book6’ సిరీస్..!
Also Read
- Britannia Biscuit: బిస్కెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న బ్రిటానియా ధరలు, తగ్గనున్న బిస్కెట్లు!
- PF Withdrawal: ATM నుండి PF డబ్బులు...! తాజా అప్డేట్ ఇదే..
- Top Stocks: ఒక షేరు ధర రూ.1 లక్ష కంటే ఎక్కువ.. దేశంలోని 5 అత్యంత ఖరీదైన స్టాక్లు ఇవే!
- SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ట్విట్టర్ హ్యాండిల్లో రష్యన్ ముడి చమురు కొనుగోలుపై వివరణ జారీ చేసింది. గత మూడు వారాలుగా కంపెనీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయలేదని, జనవరిలో ముడి చమురు వచ్చే అవకాశం లేదని పేర్కొంది. అలాగే రిలయన్స్ రష్యన్ ముడి చమురు కొనుగోలు చేస్తుందనే అన్ని మీడియా నివేదికలను ఈ ప్రకటనలో తోసిపుచ్చారు. వాస్తవానికి ఈ వివరణ ఇప్పుడు ముఖేష్ అంబానీ కంపెనీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ కంపెనీ షేర్లు 5 శాతానికి పైగా పడిపోయాయి. ముఖ్యంగా జూన్ 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత రిలయన్స్ షేర్లలో అతిపెద్ద క్షీణతను ఇప్పుడే చవిచూశాయి. దీని ఫలితంగా రిలయన్స్ వాల్యుయేషన్ లక్ష కోట్ల రూపాయలకు పైగా పడిపోయింది. నిజానికి ఇది చిన్న సంఘటన కాదు. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పతనం మొత్తం స్టాక్ మార్కెట్ నష్టానికి దారితీసింది. సెన్సెక్స్ 485 పాయింట్లు పడిపోయింది.
మంగళవారం బిఎస్ఇలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లు 5% పడిపోయి రూ.1,497.05 కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. రష్యన్ ముడి చమురును మోసుకెళ్తున్న మూడు నౌకలు జామ్నగర్ శుద్ధి కర్మాగారానికి వెళ్తున్నాయని బ్లూమ్బెర్గ్ నివేదికను కంపెనీ తిరస్కరించిన తర్వాత ఈ క్షీణత సంభవించింది. బ్లూమ్బెర్గ్ నివేదికను రిలయన్స్ కంపెనీ “పూర్తిగా తప్పు” అని పేర్కొంది. జూన్ 4, 2024 తర్వాత ఇదే రిలయన్స్ స్టాక్ అతిపెద్ద క్షీణత. స్టాక్ దాని 50-రోజుల మూవింగ్ యావరేజ్ కంటే తక్కువకు పడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ రోజు ఉదయం రూ.1,575.55 వద్ద ప్రారంభమైంది, అంతకుముందు రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ₹1,577.45 వద్ద ముగిశాయి. కానీ ఈ రోజు మధ్యాహ్నం 1:40 గంటలకు 4.69% తగ్గి ₹1,503.50 వద్ద ట్రేడవుతున్నాయి.
దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల క్షీణత కారణంగా, దాని విలువ రూ.1 లక్ష కోట్లకు పైగా తగ్గింది. BSE డేటా ప్రకారం సోమవారం కంపెనీ షేర్లు ముగిసినప్పుడు, దాని మార్కెట్ క్యాప్ ₹21,34,679.89 కోట్లుగా ఉండగా, మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఇది రూ.20,25,878.81 కోట్లకు పడిపోయింది. అంటే ట్రేడింగ్ రోజులో కంపెనీ రూ.1,08,801.08 కోట్లు కోల్పోయింది.
READ ALSO: Aman Rao Double Century: హైదరాబాద్ క్రికెటర్ ఊచకోత.. 13 సిక్స్లు, 12 ఫోర్లతో బౌలర్లకు చుక్కలు
తాజావార్తలు
-
P. Bharat Bhushan: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్గా పి. భరత్ భూషణ్..
-
Jananayagan : జననాయగన్ రిలీజ్ అయితే రూ.1000 కోట్లు పక్కా
-
Himanta Biswa Sarma: హిమంత ది అన్స్టాపబుల్.. శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక.. సీఎం ఓత్ ఫిక్స్ డేట్
-
Buttermilk vs Lassi: మజ్జిగ వర్సెస్ లస్సీ.. ఈ మండుటెండలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?
-
Hyderabad Liquor Scam: బ్రాండెడ్ మందు బాబులకు షాక్.. ప్రీమియం లిక్కర్లో చీప్ లిక్కర్..