Central Govt: చెత్తను అమ్మి రూ.2వేల కోట్లకు పైగా సంపాదించిన మోడీ ప్రభుత్వం..
- స్క్రాప్ల విక్రయం ద్వారా భారీగా నిధులు
- రూ. 2364 కోట్లను ఆర్జించిన కేంద్రం
- సోషల్ మీడియా ద్వారా తెలిపిన కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్
స్క్రాప్ల విక్రయం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత 3 ఏళ్లలో స్క్రాప్లను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 2,364 కోట్లను ఆర్జించినట్లు పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (DPIIT) తెలియజేసింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వెలువడిన వ్యర్థాలు విక్రయించారు. ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రభుత్వం ఎన్ని చోట్ల స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించిందో ఆయన పోస్ట్లో తెలిపారు. ఎన్ని ఫిజికల్ ఫైల్స్ని క్లీన్ చేశారో, ఎన్ని ఇ-ఫైళ్లను క్లీన్ చేశారో కూడా చెప్పారు. ఈ ప్రచారం ద్వారా ప్రభుత్వానికి ఈ ఏడాది రూ.650.10 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.
ఆర్థిక సహకారంతో పాటు స్వచ్ఛత..
వాస్తవానికి కార్యాలయాల్లో పడి ఉన్న ఫైళ్లు తదితర పనికిరాని వాటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంటుంది. జితేంద్ర సింగ్ పోస్ట్ ప్రకారం.. దీనికి ‘ప్రత్యేక ప్రచారం 4.0’ అని పేరు పెట్టారు. ఈ ప్రత్యేక ప్రచారం కింద ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ప్రభుత్వ ఖజానాకు గణనీయంగా దోహదపడటమే కాకుండా ప్రభుత్వ శాఖలకు పరిశుభ్రత, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించింది.
Also Read
- Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదే!
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
- RBI: ఆర్బీఐ ఈ-మాండేట్ రూల్స్ మార్పు.. కీలక మార్పులు ఇవే
ప్రధాని మోడీ ప్రశంసలు..
కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చేసిన ఈ పనిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. “‘ప్రశంసనీయమైనది! సమర్థవంతమైన నిర్వహణ, చురుకైన చర్యపై దృష్టి పెట్టడం ద్వారా ఈ ప్రయత్నం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. సమిష్టి కృషి శాశ్వత ఫలితాలను ఎలా సాధించగలదో చూపిస్తుంది.’ అని మోడీ ఎక్స్లో రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!