LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై మరో బిగ్ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో వంటగ్యాస్ (LPG) సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ పంపిణీ సజావుగా సాగుతోందని స్పష్టం చేసింది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో భారీ మార్పులు వచ్చాయి. సుమారు 96 శాతం బుకింగ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతుండటంతో పారదర్శకత పెరిగింది. వినియోగదారుల భద్రత , సరైన డెలివరీ కోసం వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) విధానాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది.
వాణిజ్య రంగంలో కూడా ఎల్పీజీ వాడకం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 5 కిలోల చిన్న సిలిండర్లకు సామాన్యుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే లక్షకు పైగా చిన్న సిలిండర్లు అమ్ముడవుతున్నాయంటే వీటి అవసరం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్చి నెల చివరి వారం నుంచి ఇప్పటివరకు సుమారు 7.8 లక్షల సిలిండర్లు అమ్ముడయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్ల వినియోగదారులు సురక్షితమైన, సులభంగా లభించే ఈ చిన్న సిలిండర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
Also Read
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
Also Read:Train Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
మరోవైపు.. ఇంధన రంగంలో ఆధునిక మార్పులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది వినియోగదారులు సంప్రదాయ సిలిండర్ల నుంచి పైపుల ద్వారా వచ్చే గ్యాస్ కనెక్షన్లకు మారడం గమనార్హం. ఇది వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఖర్చును కూడా తగ్గిస్తుంది. వీటితో పాటు పర్యావరణ హితమైన ‘కాంప్రెస్డ్ బయోగ్యాస్’ (CBG) వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, విధానాలను అమలు చేస్తోంది. రాష్ట్రాలకు అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులను ఈ బయోగ్యాస్ వినియోగంతో ముడిపెట్టడం ద్వారా దేశీయ ఇంధన వనరులను పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మీద.. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!