LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై మరో బిగ్ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో వంటగ్యాస్ (LPG) సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ పంపిణీ సజావుగా సాగుతోందని స్పష్టం చేసింది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో భారీ మార్పులు వచ్చాయి. సుమారు 96 శాతం బుకింగ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతుండటంతో పారదర్శకత పెరిగింది. వినియోగదారుల భద్రత , సరైన డెలివరీ కోసం వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) విధానాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది.
వాణిజ్య రంగంలో కూడా ఎల్పీజీ వాడకం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 5 కిలోల చిన్న సిలిండర్లకు సామాన్యుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే లక్షకు పైగా చిన్న సిలిండర్లు అమ్ముడవుతున్నాయంటే వీటి అవసరం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్చి నెల చివరి వారం నుంచి ఇప్పటివరకు సుమారు 7.8 లక్షల సిలిండర్లు అమ్ముడయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్ల వినియోగదారులు సురక్షితమైన, సులభంగా లభించే ఈ చిన్న సిలిండర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
Also Read
- Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
- Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
Also Read:Train Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
మరోవైపు.. ఇంధన రంగంలో ఆధునిక మార్పులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది వినియోగదారులు సంప్రదాయ సిలిండర్ల నుంచి పైపుల ద్వారా వచ్చే గ్యాస్ కనెక్షన్లకు మారడం గమనార్హం. ఇది వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఖర్చును కూడా తగ్గిస్తుంది. వీటితో పాటు పర్యావరణ హితమైన ‘కాంప్రెస్డ్ బయోగ్యాస్’ (CBG) వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, విధానాలను అమలు చేస్తోంది. రాష్ట్రాలకు అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులను ఈ బయోగ్యాస్ వినియోగంతో ముడిపెట్టడం ద్వారా దేశీయ ఇంధన వనరులను పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మీద.. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!