LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై మరో బిగ్ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో వంటగ్యాస్ (LPG) సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ పంపిణీ సజావుగా సాగుతోందని స్పష్టం చేసింది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో భారీ మార్పులు వచ్చాయి. సుమారు 96 శాతం బుకింగ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతుండటంతో పారదర్శకత పెరిగింది. వినియోగదారుల భద్రత , సరైన డెలివరీ కోసం వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) విధానాన్ని ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది.
వాణిజ్య రంగంలో కూడా ఎల్పీజీ వాడకం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 5 కిలోల చిన్న సిలిండర్లకు సామాన్యుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే లక్షకు పైగా చిన్న సిలిండర్లు అమ్ముడవుతున్నాయంటే వీటి అవసరం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్చి నెల చివరి వారం నుంచి ఇప్పటివరకు సుమారు 7.8 లక్షల సిలిండర్లు అమ్ముడయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్ల వినియోగదారులు సురక్షితమైన, సులభంగా లభించే ఈ చిన్న సిలిండర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
Also Read
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
Also Read:Train Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
మరోవైపు.. ఇంధన రంగంలో ఆధునిక మార్పులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది వినియోగదారులు సంప్రదాయ సిలిండర్ల నుంచి పైపుల ద్వారా వచ్చే గ్యాస్ కనెక్షన్లకు మారడం గమనార్హం. ఇది వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ఖర్చును కూడా తగ్గిస్తుంది. వీటితో పాటు పర్యావరణ హితమైన ‘కాంప్రెస్డ్ బయోగ్యాస్’ (CBG) వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, విధానాలను అమలు చేస్తోంది. రాష్ట్రాలకు అదనపు వాణిజ్య ఎల్పీజీ కేటాయింపులను ఈ బయోగ్యాస్ వినియోగంతో ముడిపెట్టడం ద్వారా దేశీయ ఇంధన వనరులను పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మీద.. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?