Smart Tires Launch: స్మార్ట్ టైర్లను లాంచ్ చేసిన JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్
- దేశంలో మొట్టమొదటి ఎంబెడెడ్ స్మార్ట్ టైర్లను..
- విడుదల చేసిన JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్
- ఈ టైర్లు వాహన పనితీరు, భద్రత,
- ఇంధన సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తాయన్న కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు “ఇంటెలిజెంట్ మొబిలిటీ” యొక్క కొత్త యుగంలోకి ప్రవేశించింది. JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలో మొట్టమొదటి ఎంబెడెడ్ స్మార్ట్ టైర్లను విడుదల చేసింది. ప్రయాణీకుల వాహనాల కోసం రూపొందించబడిన ఈ ఆవిష్కరణ, కేవలం టైర్ లాగానే కాకుండా “స్మార్ట్ మెషిన్” లాగా పనిచేస్తుంది. ఈ టైర్లు వాహన పనితీరు, భద్రత, ఇంధన సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తాయని కంపెనీ పేర్కొంది.
Read Also:Caffeine Benefits: కెఫిన్ తగిన మోతాదులో తీసుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా..
Also Read
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- NPPA: సామాన్యుడికి భారీ ఉపశమనం.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం
ఈ స్మార్ట్ టైర్ను తామే అభివృద్ధి చేసినట్లు JK టైర్ సంస్థ తెలిపింది. మధ్యప్రదేశ్లోని బాన్మోర్లోని తన తయారీ కర్మాగారంలో కంపెనీ దీనిని ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ టైర్లలో గాలి పీడనం, ఉష్ణోగ్రత సంభావ్య గాలి లీకేజీలు వంటి సమాచారాన్ని కనిపెట్టే సెన్సార్లు అమర్చబడి ఉంటాయని.. ఈ డేటా డ్రైవర్ను ఆ సమయంలో హెచ్చరిస్తుందని సంస్థ వివరించింది. ఇది రహదారి భద్రత, నిర్వహణ ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొంది. ఈ సాంకేతికత టైర్లు జీవితకాలాన్ని పొడిగించడానికి, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
Read Also:Woman Conductor: హ్యట్సాఫ్ మేడం.. చంటి బిడ్డతో ఎత్తుకుని.. డ్యూటీ చేస్తున్న మహిళా కండకర్ట్
JK టైర్ విజయం కేవలం ఒక ఉత్పత్తి ఆవిష్కరణ మాత్రమే కాదు, “ఆత్మనిర్భర్ భారత్” (మేక్ ఇన్ ఇండియా) కి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ కూడా అంటూ కంపెనీ యాజమాన్యం తెలిపింది.. ఎంబెడెడ్ స్మార్ట్ టైర్ ఆవిష్కరణ జెకె టైర్ ఆవిష్కరణ ప్రయాణంలో ఒక కీలకమైన మైలురాయని.. జేకే టైర్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రఘుపతి సింఘానియా అన్నారు. ఈ స్మార్ట్ టైర్లను మొదటగా ఆఫ్టర్ మార్కెట్ కోసం విడుదల చేసినట్లు తెలిపారు. ఈ స్మార్ట్ టైర్లు 14 అంగుళాల నుండి 17 అంగుళాల వరకు సైజుల్లో లభిస్తాయని.. . ఈ టైర్లను కాంపాక్ట్ కార్ల నుండి ప్రీమియం సెడాన్ల వరకు వాహనాలలో ఉపయోగించవచ్చన్నారు. వీటి ధరలకు సంబంధించి.. కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేదు.
తాజావార్తలు
-
Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్పై వేటు?
-
Ketan Murder Case: కేతన్ను చంపింది సియానే.. కానీ కోర్టులో నిరూపించడమే అసలు సవాల్!
-
Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
ట్రెండింగ్
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!