Jio and Airtel: ఇండిపెండెన్స్ డే సందర్భంగా జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ క్యాష్బ్యాక్ ఆఫర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio and Airtel: ఇవాళ ఇండియా 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జియో, ఎయిర్టెల్ కంపెనీలు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లు, ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ బెనెఫిట్లు ప్రకటించాయి. ఈ రోజు జియో కస్టమర్లు 2 వేల 999 రూపాయలు మరియు 719 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే వంద శాతం క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు పొందుతారు. ఎయిర్టెల్ యూజర్లు 519 మరియు 779 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే వివిధ రూపాల్లో క్యాష్ బ్యాక్ బెనెఫిట్లు లభిస్తాయి.
ఆదాయం రెట్టింపు
Also Read
- Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు... ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
- Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..'మేక్ ఇన్ ఇండియా'కు బలం
- EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
- Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కార్పొరేట్ ఆదాయాలు రెండంకెల్లో పెరిగాయి. కానీ లాభాలు మాత్రం రికార్డ్ స్థాయిలో పడిపోయాయి. 2021 తొలి త్రైమాసికంతో పోల్చితే ఈసారి కార్పొరేట్ ఆదాయాలు తక్కువే నమోదయ్యాయి. గడచిన నాలుగు త్రైమాసికాల కన్నా కూడా ఇదే తక్కువని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. సేల్స్ పెరుగుతున్నప్పటికీ ఇలాంటి పరిస్థితి నెలకొనటం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
Azadi ka amrit mahotsav: భారతదేశ చరిత్రలో మరపురాని ఘట్టం.. స్వాతంత్ర్య అమృత మహోత్సవం..
వసూళ్లు భళా
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 40 శాతం పెరిగాయి. ఇన్కం ట్యాక్స్ కలెక్షన్లు 52 శాతం వృద్ధి చెందటం కలిసొచ్చింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల్లోనే మూడో వంతు కన్నా ఎక్కువ ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జరిగాయి. కార్పొరేషన్ మరియు పర్సనల్ ఇన్కం ట్యాక్స్ కలిపి 5 ట్రిలియన్ రూపాయల వరకు వచ్చాయి. 14 ట్రిలియన్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా దాదాపు 35 శాతం టార్గెట్ రీచ్ అయింది.
ఎస్బీఐ 3వసారి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్ని 20 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తోంది. దీంతో మూడు నెలల ఎంసీఎల్ఆర్ ప్రస్తుతం 7 పాయింట్ మూడు, ఐదు శాతానికి పెరిగింది. ఎంసీఎల్ఆర్తోపాటు ఈబీఎల్ఆర్ మరియు రెపో లింక్డ్ లెండింగ్ రేట్ని కూడా 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఎస్బీఐ వడ్డీ రేట్లు పెరగటం గత మూడు నెలల్లో ఇది మూడోసారి.
లుపిన్.. న్యూ ప్లాన్
అమెరికన్ ఫార్మాసిటికల్ కంపెనీ లుపిన్ ఆ దేశంలోని ప్రొడక్ట్ పోర్ట్ఫోలియాలో సవరణలు చేస్తోంది. నోటి ద్వారా వేసుకునే సాధారణ ఔషధాల నుంచి సంక్లిష్ట జనరిక్ మెడిసిన్స్ వైపు ఫోకస్ పెడుతోంది. మార్కెట్లో మందుల రేట్ల తగ్గుదల వల్ల సంస్థపై పడుతున్న ఆర్థిక ప్రభావం నుంచి తేరుకునేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు కంపెనీ సీఈవో వినితా గుప్తా చెప్పారు.
ఇక ఒకే టారిఫ్
రాష్ట్రాలు సేకరించే పునరుత్పాదక ఇంధనానికి ఇకపై ఒకే రకమైన టారిఫ్ను వసూలు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ ప్రతిపాదించింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేసే ప్రాజెక్టులకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. రెనివబుల్ ఎనర్జీ ప్రొక్యూర్మెంట్ల విషయంలో ఇదొక భారీ మార్పని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!