Stock Market Crash: దలాల్ స్ట్రీట్లో రక్తపాతం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్ – తుడిచిపెట్టుకుపోయిన రూ.10 లక్షల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో చీకటి రోజు నమోదైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు దలాల్ స్ట్రీట్ను ముంచేశాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీలు పేకమేడల్లా కూలిపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. వారం చివరి రోజున మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బిఎస్ఇ సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు (1.93%) పతనమై 74,563 వద్ద ముగిసింది. నిఫ్టీ 50: 488.05 పాయింట్లు (2.06%) క్షీణించి 23,151 వద్ద స్థిరపడింది.
READ ALSO: The Paradise: ఆయా షేర్ కోసం 2.5 ఎకరాల సెట్.. విశేషాలు వింటే మైండ్ బ్లాక్
Also Read
- Samsung Roasts Apple's First Foldable: యాపిల్ ఫోల్డబుల్పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
- UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు..
* ఇరాన్ రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఆందోళనలు పెరిగాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత భయాలతో బ్రెంట్ ముడి చమురు ధర $100.5 మార్కును దాటింది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ.
* అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలం పుంజుకోవడంతో, భారత రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 92.37 స్థాయికి పడిపోయింది.
* విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం తమ వాటాలను విక్రయిస్తున్నారు. ఒక్క మార్చి నెలలోనే ఇప్పటి వరకు రూ.39 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మార్కెట్ను మరింత కుంగదీసింది.
* ఆసియా మార్కెట్లతో పాటు అమెరికాలోని డౌ జోన్స్, నాస్డాక్ సూచీలు కూడా భారీ నష్టాల్లో ట్రేడవుతుండటం దేశీయ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.
రంగాల వారీగా నష్టాలు
ఈ రోజు పతనంలో మెటల్, పిఎస్యు బ్యాంక్, ఆటో రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టాటా స్టీల్, ఎస్బీఐ వంటి దిగ్గజ షేర్లు 4-5% వరకు నష్టపోయాయి. అయితే, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కొన్ని సంస్థలు మాత్రం స్వల్పంగా కోలుకున్నాయి. యుద్ధం ముదిరితే ముడి చమురు ధరలు మరింత పెరిగి, ద్రవ్యోల్బణం భారంగా మారుతుందనే ఆందోళనలో ఇన్వెస్టర్లు ఉన్నారు. ప్రస్తుతానికి మార్కెట్ అనిశ్చితిలో ఉన్నందున పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Shantanu Narayen: టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. అడోబ్ సీఈఓ పదవికి హైదరాబాదీ గుడ్ బై!
తాజావార్తలు
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
-
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్కు హైకోర్టు ఆదేశం
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!