Stock Market Crash: దలాల్ స్ట్రీట్లో రక్తపాతం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్ – తుడిచిపెట్టుకుపోయిన రూ.10 లక్షల కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో చీకటి రోజు నమోదైంది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు దలాల్ స్ట్రీట్ను ముంచేశాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్, నిఫ్టీలు పేకమేడల్లా కూలిపోవడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. వారం చివరి రోజున మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బిఎస్ఇ సెన్సెక్స్ 1,470.50 పాయింట్లు (1.93%) పతనమై 74,563 వద్ద ముగిసింది. నిఫ్టీ 50: 488.05 పాయింట్లు (2.06%) క్షీణించి 23,151 వద్ద స్థిరపడింది.
READ ALSO: The Paradise: ఆయా షేర్ కోసం 2.5 ఎకరాల సెట్.. విశేషాలు వింటే మైండ్ బ్లాక్
Also Read
- Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
- Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!
- Vodafone - Idea: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. కానీ వొడాఫోన్ ఐడియా షేర్లకు రెక్కలు! షేర్ ధర ఎంత పెరిగిందంటే..
- Warren Buffett: 'అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది'.. వారెన్ బఫెట్
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు..
* ఇరాన్ రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఆందోళనలు పెరిగాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత భయాలతో బ్రెంట్ ముడి చమురు ధర $100.5 మార్కును దాటింది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ.
* అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలం పుంజుకోవడంతో, భారత రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 92.37 స్థాయికి పడిపోయింది.
* విదేశీ ఇన్వెస్టర్లు నిరంతరం తమ వాటాలను విక్రయిస్తున్నారు. ఒక్క మార్చి నెలలోనే ఇప్పటి వరకు రూ.39 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మార్కెట్ను మరింత కుంగదీసింది.
* ఆసియా మార్కెట్లతో పాటు అమెరికాలోని డౌ జోన్స్, నాస్డాక్ సూచీలు కూడా భారీ నష్టాల్లో ట్రేడవుతుండటం దేశీయ మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.
రంగాల వారీగా నష్టాలు
ఈ రోజు పతనంలో మెటల్, పిఎస్యు బ్యాంక్, ఆటో రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టాటా స్టీల్, ఎస్బీఐ వంటి దిగ్గజ షేర్లు 4-5% వరకు నష్టపోయాయి. అయితే, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కొన్ని సంస్థలు మాత్రం స్వల్పంగా కోలుకున్నాయి. యుద్ధం ముదిరితే ముడి చమురు ధరలు మరింత పెరిగి, ద్రవ్యోల్బణం భారంగా మారుతుందనే ఆందోళనలో ఇన్వెస్టర్లు ఉన్నారు. ప్రస్తుతానికి మార్కెట్ అనిశ్చితిలో ఉన్నందున పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: Shantanu Narayen: టెక్ ప్రపంచంలో పెను సంచలనం.. అడోబ్ సీఈఓ పదవికి హైదరాబాదీ గుడ్ బై!
తాజావార్తలు
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?