Stock Market: 5 నిమిషాల్లో రూ.8 లక్షల కోట్ల లాస్.. పేకమేడలా కుప్పకూలిన స్టాక్ మార్కెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ గురువారం ఒక ‘బ్లాక్ థర్స్డే’గా మిగిలిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు దేశీయ మార్కెట్లను కమ్మేశాయి. మార్కెట్ ప్రారంభమైన కేవలం ఐదు నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద సునామీలో కొట్టుకుపోయినట్లుగా రూ.8 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి.
Also Read
- Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్
ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రతరం కావడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింటుందనే భయాలు మొదలయ్యాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $112 మార్కును దాటింది. ముడి చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపారు.
1800 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ఈ రోజు సెన్సెక్స్ దాదాపు 1,800 పాయింట్లు (2.35%) పతనమై 74,869 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఏకంగా 532 పాయింట్లు (2.23%) నష్టపోయి 23,238 వద్ద స్థిరపడింది. నిన్నటి వరకు లాభాలతో ఊరించిన మార్కెట్, ఈరోజు ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడం ఇన్వెస్టర్లను కోలుకోలేని దెబ్బ తీసింది. మార్కెట్ పతనం కేవలం కొన్ని కంపెనీలకే పరిమితం కాలేదు. లార్జ్-క్యాప్ నుంచి స్మాల్-క్యాప్ వరకు అన్ని విభాగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ అమ్మకాల ఒత్తిడితో బ్యాంకింగ్, మౌలిక సదుపాయాల రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్&టీ (L&T) వంటి బలమైన స్టాక్స్ కూడా భారీ నష్టాలను చవిచూశాయి. నేడు ట్రేడ్ అయిన 2,006 స్టాక్స్లో 1,390 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. కేవలం 469 స్టాక్స్ మాత్రమే లాభాల్లో నిలవగలిగాయి. 40 స్టాక్స్ ఏడాది కనిష్ఠ స్థాయికి పడిపోవడం మార్కెట్ దయనీయ స్థితికి అద్దం పడుతోందని చెబుతున్నారు.
అంతర్జాతీయ పరిస్థితులు కుదుటపడే వరకు మార్కెట్లో ఇదే విధమైన హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తదుపరి పరిణామాలపై స్పష్టత వచ్చే వరకు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
READ ALSO: BPCL LPG ATM: గ్యాస్ కష్టాలకు చెక్.. దేశంలోనే తొలి ‘LPG ATM’ స్టార్ట్.. ఎక్కడో చూసేయండి!
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!