Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Rupee Crash: భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి ఇటీవల నెలల్లో రూపాయి పతనం అయ్యింది. నిజానికి అంతర్జాతీయ పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. సోమవారం భారత రూపాయి చరిత్రలోనే అత్యంత దారుణమైన పతనాన్ని చవిచూసింది. అమెరికా డాలర్తో పోలిస్తే ఏకంగా 82 పైసలు క్షీణించి, 95.31 వద్ద రికార్డ్ స్థాయి కనిష్టానికి పడిపోయింది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న యుద్ధ మేఘాలు, ముడి చమురు ధరల పెరుగుదల దేశీయ కరెన్సీని పాతాళానికి నెట్టాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ట్రంప్ నిర్ణయంతో మారిన సీన్..
ఇరాన్ పంపిన తాజా శాంతి ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ ప్రతిపాదన ‘అంగీకారయోగ్యం కాదు’ అని ట్రంప్ ప్రకటించడంతో, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయన్న భయంతో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 2.52 శాతం పెరిగి బ్యారెల్కు 103.8 డాలర్లకు చేరింది.
Also Read
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
ప్రధాని మోడీ ‘పొదుపు’ మంత్రం..
దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పౌరులకు కీలక విజ్ఞప్తి చేశారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అనవసరమైన పెట్రోల్, డీజిల్ ఖర్చులను తగ్గించుకోవాలని, విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్లకుండా బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని కీలక సూచనలు చేశారు. ప్రస్తుత అనిశ్చితి ముగిసే వరకు విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని ఆయన దేశ ప్రజలకు సూచించారు. వీటితో స్వల్పకాలంలో వృద్ధి మందగించినప్పటికీ, దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇవి తప్పనిసరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బలహీనపడిన విదేశీ మారక నిల్వలు
ఒకవైపు డాలర్ ఇండెక్స్ 98.02 పాయింట్లకు చేరుకుని బలపడుతుండగా, మరోవైపు విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులను వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం.. భారత విదేశీ మారక నిల్వలు ఒకే వారంలో సుమారు $7.79 బిలియన్లు తగ్గి, $690.69 బిలియన్లకు పడిపోయాయి. సోమవానం నాడు రికార్డ్ స్థాయిలో రూపాయి పతనంతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. ఈ రోజు సెన్సెక్స్ 1,312 పాయింట్లు పతనమై 76,015 వద్ద ముగిసింది. నిఫ్టీ 360 పాయింట్లు నష్టపోయి 23,815 స్థాయికి పడిపోయింది. కేవలం ఒక్కరోజే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.4,110 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. రానున్న రోజుల్లో రూపాయి మరింత బలహీనపడి 95.50 స్థాయికి చేరే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చమురు దిగుమతులు భారత్కు భారం కానున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!