NTV Telugu Site icon

Narayana Murthy: చైనాతో భారత్ పోటీ పడలేదు..!ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు సంచలన వ్యాఖ్యలు..

Narayana Murthy

Narayana Murthy

చైనాను వదిలిపెట్టి భారత్‌ గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా మారడం అంత సులువు కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. ‘ELCIA టెక్ సమ్మిట్ 2024’లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం చైనా తయారీ సామర్థ్యంతో భారత్‌ పోటీపలేదని స్పష్టం చేశారు. భారతదేశం ఈ రంగంలో ముందుకు సాగాలంటే ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పాలనలో మెరుగుదల అవసరం అని ఆయన అన్నారు. ‘హబ్’, ‘గ్లోబల్ లీడర్’ వంటి పెద్ద పదాలను వాడకుండా ఉండాలని మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘చైనా ఇప్పటికే ప్రపంచ కర్మాగారంగా మారింది. ఇతర దేశాల్లోని సూపర్‌మార్కెట్లు,హోమ్ డిపోలలో 90% వస్తువులను చైనాలో తయారు చేస్తారు. వారి ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) భారతదేశం కంటే ఆరు రెట్లు పెద్దది. అటువంటి పరిస్థితిలో.. భారతదేశం తయారీ కేంద్రంగా మారుతుందని చెప్పడం చాలా పెద్ద విషయం.” అని వ్యాఖ్యానించారు.

READ MORE: Sonam Wangchuk: లడఖ్‌పై కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం..ఆగస్టు 15 నుంచి నిరాహార దీక్ష..

కారణాలను వివరించారు..
ఐటీ రంగం ఎగుమతులపై ఆధారపడి ఉంటుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు అన్నారు. అదే సమయంలో.. “తయారీ రంగంలో దేశీయ సహకారం ఎక్కువగా ఉంది. తయారీ రంగం విజయంలో ప్రభుత్వ పాత్ర కీలకం. దురదృష్టవశాత్తు, భారతదేశం వంటి దేశంలో.. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత, వేగం, శ్రేష్ఠతలో ఇంకా మెరుగుదల అవసరం. తయారీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం, పరిశ్రమల మధ్య కనీస జోక్యం కావాలి. మార్కెట్ పరిస్థితిని బాగా అంచనా వేయడానికి.. విలువను జోడించడానికి వ్యాపారవేత్తలు సాధారణ గణిత నమూనాలను ఉపయోగించడం నేర్చుకోవాలి. వ్యాపారవేత్తలు మార్కెట్‌ను అంచనా వేయడం నేర్చుకోవాలి. ఎంత మార్కెట్‌ను కైవసం చేసుకోగలదో అంచనా వేయాలి. మార్కెట్‌లో ఉన్న అన్ని ఇతర ఆలోచనల కంటే ఎక్కువ విలువను తీసుకురావడానికి వారు సాధారణ గణిత నమూనాలను సృష్టించగలగాలి. విజయానికి ఈ జ్ఞానం, ప్రతిభ అవసరం.” అని ఆయన ఉద్ఘాటించారు.