Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakambari Devi Temple Flood: ఉత్తరప్రదేశ్ లోని సహారన్పూర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సిద్ధపీఠ శ్రీ శాకంబరి దేవి ఆలయ పరిసరాల్లో గురువారం అర్ధరాత్రి ఆకస్మిక వరదలు రావడంతో భారీ విషాదాన్ని మిగిల్చాయి. శివాలిక్ కొండల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద నీరు ఆలయ ప్రాంతంలోకి చేరుకుంది. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు కేవలం కొన్ని నిమిషాల్లోనే జలమయమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోగా, భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. ఆలయ ప్రాంగణంలో భక్తులు విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా భారీగా నీటి ప్రవాహం రావడంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. నీటి ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో పెద్ద శబ్దాలతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. చిన్నారులు, మహిళలను తీసుకుని ఎత్తైన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read
- Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
- Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే 'పచ్చిమిర్చి ఆవకాయ'.! తింటే వావ్ అనాల్సిందే..
- టెస్లా లవర్స్కి గుడ్ న్యూస్.. రూ.9 లక్షల తగ్గింపుతో మార్కెట్లోకి సరికొత్త Tesla Model Y మోడల్.. ఫీచర్స్ అదుర్స్!!
- Supreme Court: సె*క్స్ వర్కర్ల హక్కుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. చారిత్రాత్మక మార్గదర్శకాలు..
భారీ వరద ప్రవాహంలో ట్రాక్టర్ ట్రాలీలు, కార్లు, బైక్లు, నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తున్న యంత్రాలు కొట్టుకుపోయాయి. ఆలయ సమీపంలోని ప్రసాదం దుకాణాలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు వరద ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నేడు ఉదయం వెలుగులోకి వచ్చిన దృశ్యాలు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేశాయి. పలుచోట్ల వాహనాలు బురదలో కూరుకుపోయి కనిపించాయి. స్థానికులు, భక్తులు కలిసి వాటిని బయటకు తీసేందుకు గంటల తరబడి శ్రమించారు. వరద కారణంగా అనేక దుకాణాలు దెబ్బతినగా, ఆలయ పరిసర ప్రాంతమంతా బురద, చెత్తతో నిండిపోయింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలన అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
-
Supreme Court: దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ ‘112’.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు
-
Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!
-
Naga Chaitanya : ఢిల్లీ హైకోర్టులో అక్కినేని నాగచైతన్యకు ఊరట
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!