Shakambari Devi Temple Flood: వరదల్లో చిక్కుకున్న శాకంబరి ఆలయం.. ఇద్దరు మహిళా భక్తులు మృతి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakambari Devi Temple Flood: ఉత్తరప్రదేశ్ లోని సహారన్పూర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ సిద్ధపీఠ శ్రీ శాకంబరి దేవి ఆలయ పరిసరాల్లో గురువారం అర్ధరాత్రి ఆకస్మిక వరదలు రావడంతో భారీ విషాదాన్ని మిగిల్చాయి. శివాలిక్ కొండల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరద నీరు ఆలయ ప్రాంతంలోకి చేరుకుంది. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు కేవలం కొన్ని నిమిషాల్లోనే జలమయమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోగా, భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. ఆలయ ప్రాంగణంలో భక్తులు విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా భారీగా నీటి ప్రవాహం రావడంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. నీటి ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో పెద్ద శబ్దాలతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. చిన్నారులు, మహిళలను తీసుకుని ఎత్తైన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
భారీ వరద ప్రవాహంలో ట్రాక్టర్ ట్రాలీలు, కార్లు, బైక్లు, నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తున్న యంత్రాలు కొట్టుకుపోయాయి. ఆలయ సమీపంలోని ప్రసాదం దుకాణాలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు వరద ప్రవాహంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నేడు ఉదయం వెలుగులోకి వచ్చిన దృశ్యాలు అక్కడి పరిస్థితి తీవ్రతను తెలియజేశాయి. పలుచోట్ల వాహనాలు బురదలో కూరుకుపోయి కనిపించాయి. స్థానికులు, భక్తులు కలిసి వాటిని బయటకు తీసేందుకు గంటల తరబడి శ్రమించారు. వరద కారణంగా అనేక దుకాణాలు దెబ్బతినగా, ఆలయ పరిసర ప్రాంతమంతా బురద, చెత్తతో నిండిపోయింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలన అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!