Site icon NTV Telugu

Gold Rates: మగువలకు షాక్.. ఈరోజు గోల్డ్ ఎంత పెరిగిందంటే..!

Gold

Gold

పసిడి మళ్లీ షాకిచ్చింది. కనకం దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. రాకెట్‌లా దూసుకెళ్లిపోతుంది. పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు చూసి సామాన్యుడి గుండె ఝళ్లుమంటోంది. బంగారం కొనేదెలా అంటూ బెంబేలెత్తిపోతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,470 పెరిగింది. వెండి మాత్రం ఉపశమనం కలిగింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గింది.

ఇది కూడా చదవండి: US: అమెరికాపై మంచు ఖడ్గం.. 2,700 విమానాలు రద్దు

తులం గోల్డ్‌పై రూ.1,470 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,58,620 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,350 పెరగడంతో రూ.1,45,400 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,110 పెరగడంతో రూ.1,18,970 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’ నుంచి మరో బిగ్ ట్రీట్..

ఈరోజు సిల్వర్ ఉపశమనం కలిగింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,35, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్‌, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,55,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.3,35, 000 దగ్గర అమ్ముడవుతోంది.

Exit mobile version