NTV Telugu Site icon

నిల‌క‌డ‌గా బంగారం…దిగొస్తున్న వెండి…

క‌రోనా మ‌హమ్మారి క్ర‌మంగా తగ్గుముఖం పడుతున్న‌ది.  చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నారు.  తిరిగి మార్కెట్లు యధావిధిగా న‌డుస్తున్నాయి.  క‌రోనా స‌మ‌యంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్త‌డి ఆ త‌రువాత తగ్గుతూ వ‌చ్చింది.  ఈ రోజు హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధ‌ర రూ.45,900 వ‌ద్ద స్థిరంగా ఉండ‌గా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.50,070 వ‌ద్ద నిల‌క‌డ‌గా ఉన్న‌ది.  బంగారం ధ‌ర‌లు నిల‌క‌డ‌గా ఉండ‌గా, వెండి ధ‌ర‌మాత్రం కొంత‌మేర తగ్గింది.  కిలో వెండి ధ‌ర రూ.200 త‌గ్గి రూ.76,200కి చేరింది.