German Railways: భారత్ నుంచి లోకో పైలట్లను రిక్రూట్ చేసుకున్న జర్మన్ రైల్వే..
- జర్మనీకి చెందిన ప్రభుత్వ రైల్వే కంపెనీ డ్యూయిష్ బాన్
- గ్లోబల్ ప్రాజెక్ట్ల కోసం భారత్ లోకో పైలట్లను నియమించుకున్న డీబీ
- భారతీయ మార్కెట్లోకి విస్తరించాలనుకుంటున్న కంపెనీ
- భారతదేశంలోని అనేక నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జర్మనీకి చెందిన ప్రభుత్వ రైల్వే కంపెనీ డ్యూయిష్ బాన్ (డీబీ) తన గ్లోబల్ ప్రాజెక్ట్ల కోసం భారతదేశం నుంచి లోకో పైలట్లను నియమించుకోవడం ప్రారంభించింది. మెట్రో సిస్టమ్స్ కోసం కన్సల్టెన్సీ, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ని అందించడం ద్వారా కంపెనీ భారతీయ మార్కెట్లోకి కూడా విస్తరించాలనుకుంటోంది. భారతదేశంలోని అనేక నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. కంపెనీ ఇటీవలే భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ వేగవంతమైన రైలు రవాణా సేవ (RRTS) అనగా నమో భారత్ను నడుపుతూ ఒక సంవత్సరం పూర్తి చేసింది. జూలై 2022లో, డీబీ ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ఆర్ఆర్టీఎస్ ని 12 సంవత్సరాల పాటు నిర్వహించడానికి హక్కులను పొందింది.
READ MORE: Samsung: శాంసంగ్ నుంచి రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లు.. డిటైల్స్ ఇవే
Also Read
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
డీబీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ సీఈవో నికో వార్బనోఫ్.. జర్మనీలో రైలు డ్రైవర్ల కొరత ఉందని, గ్లోబల్ ప్రాజెక్ట్లలో భారతీయ ఉద్యోగులను ఉపయోగించాలనుకుంటున్నామని ఓ జాతీయ మీడియాకు తెలిపారు. దాదాపు 100 మంది ఉద్యోగులకు గ్లోబల్ పాత్రల కోసం శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. కంపెనీకి భారతదేశంలో 600 మంది ఉద్యోగుల అవసరం ఉంది. ఘజియాబాద్లోని దుహై, పరిసర ప్రాంతాల నుంచి కంపెనీ ఉద్యోగులను నియమించుకున్నట్లు వార్బనోఫ్ చెప్పారు.
READ MORE:Film Chamber Committee: ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా మంత్రి
తాము ఒక సంవత్సరం క్రితం భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించామని.. తమ 600 మంది ఉద్యోగులతో 42 కి.మీ విస్తీర్ణంలో విజయవంతంగా ఆర్ఆర్టీఎస్ సేవలను నడుపుతున్నామని నికో వార్బనోఫ్ అన్నారు. కంపెనీకి భారత్ వ్యూహాత్మక మార్కెట్ అని ఆయన కొనియాడారు. జూలై 2022లో 12 సంవత్సరాల పాటు ఢిల్లీ-మీరట్ ఆర్ఆర్టీఎస్ నిర్వహణ హక్కులను కంపెనీ పొందింది. ఈ ఒప్పందం విలువ ₹1,000 కోట్ల కంటే ఎక్కువ. సమగ్ర ఆపరేషన్, నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ పార్టీకి అప్పగించడం ఇదే మొదటిసారి.
తాజావార్తలు
-
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
-
Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!