Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
- తప్పు ఒప్పుకోలేదు.. కానీ రూ. 150 కోట్లు కడతాం
- న్యూయార్క్ కోర్టులో అదానీల సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Adani: ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అమెరికాలో భారీ షాక్ తగిలింది. వీరిద్దరిపై మొత్తం 18 మిలియన్ డాలర్ల (సుమారు రూ.150 కోట్లు) పౌర ద్రవ్య జరిమానా (Civil Monetary Penalties) విధించాలని యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ప్రతిపాదించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు సంబంధించిన ఒక వివాదంలో ఈ ముందస్తు జరిమానాలు చెల్లించడానికి అదానీలు అంగీకరించారు.
అసలు వివాదం ఏంటి..
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 2021లో చేపట్టిన బాండ్ ఆఫరింగ్కు సంబంధించి.. పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించేలా అబద్ధపు ప్రకటనలు చేశారనేది ప్రధాన ఆరోపణ. భారతదేశంలో భారీ సౌరశక్తి (సోలార్ పవర్) కాంట్రాక్టులను దక్కించుకోవడానికి అదానీలు ఒక పెద్ద లంచాల పథకాన్ని రూపొందించారని, అయితే అమెరికా పెట్టుబడిదారుల వద్దకు వచ్చేసరికి తాము ఎలాంటి అవినీతి పద్ధతులు పాటించడం లేదంటూ తప్పుడు సమాచారం ఇచ్చారని యూఎస్ ఏజెన్సీలు నిర్ధారించాయి.
Also Read
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
- Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
ఎవరిపై ఎంత జరిమానా అంటే..
ఎస్ఈసీ (SEC) ప్రతిపాదించిన ఈ జరిమానాలో భాగంగా.. గౌతమ్ అదానీపై 6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.50 కోట్లు), సాగర్ అదానీపై 12 మిలియన్ డాలర్లు (సుమారు రూ.100 కోట్లు) జరిమానా విధించారు. “సివిల్ ఫిర్యాదులో చేసిన ఆరోపణలను మేము అంగీకరించడం లేదు.. అలాగని ఖండించడం లేదు. కానీ, కోర్టు తుది తీర్పును గౌరవిస్తూ వరుసగా 6 మిలియన్ డాలర్లు, 12 మిలియన్ డాలర్ల సివిల్ జరిమానా చెల్లించడానికి గౌతమ్ అదానీ, సాగర్ అదానీ అంగీకరించారు” అని అదానీ గ్రీన్ ఎనర్జీ ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో అధికారికంగా వెల్లడించింది. మే 14న న్యూయార్క్ కోర్టులో దాఖలు చేసిన ప్రతిపాదిత తుది తీర్పులలో ఈ జరిమానాలు ఒక భాగంగా ఉన్నాయి.
రూ. 2200 కోట్ల లంచాల ఆరోపణలు!
గతేడాది (2024) నవంబర్లో ఈ సంచలన అవినీతి కుంభకోణం బయటపడింది. ఒక ప్రధాన సోలార్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా రాబోయే రెండు దశాబ్దాలలో దాదాపు 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16,600 కోట్లు) లాభాలను ఆర్జించేలా కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం.. భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2,200 కోట్లు) లంచాలు ఇవ్వడానికి అదానీలు పథకం వేశారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.
అవినీతిని దాచిపెట్టి రూ. 25,000 కోట్ల సమీకరణ
ఈ మొత్తం లంచాల వ్యవహారాన్ని, అవినీతిని అంతర్జాతీయ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి దాచిపెట్టి.. రుణాలు, బాండ్ ఆఫరింగ్ల ద్వారా అదానీ గ్రూప్ ఏకంగా 3 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 25,000 కోట్లు) నిధులను సమీకరించిందని యూఎస్ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో గౌతమ్ అదానీ, సాగర్ అదానీలతో పాటు అదానీ గ్రీన్ ఎనర్జీ మాజీ సీఈఓ వినీత్ జైన్ కూడా నిందితులుగా ఉన్నారు. వీరిపై సెక్యూరిటీస్ మోసం, సెక్యూరిటీస్ మోసం కుట్ర మరియు వైర్ ఫ్రాడ్ కుట్ర వంటి తీవ్రమైన క్రిమినల్, సివిల్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అమెరికా ఏజెన్సీల ఆధ్వర్యంలో ఈ కేసుల సమీక్ష కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..