Myntra: మింత్రాకు ఝలక్ ఇచ్చిన ఈడీ.. రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై కేసు నమోదు..!
- మింత్రాకు ఝలక్ ఇచ్చిన ఈడీ.
- రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై కేసు.
- అధికారులకు అవసరమైనంత సహకారం అందిస్తాం.. మింత్రా ప్రతినిధులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Myntra: భారత్ లో ఆన్లైన్ సేవలను అందించే మింత్రాకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఝలక్ ఇచ్చింది. ఫ్యాషన్, సంప్రదాయ దుస్తులకు నిలయంగా మారిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మింత్రా (Myntra) ఇప్పుడు విదేశీ పెట్టుబడుల నిబంధనలను (FDI Norms) ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించి దర్యాప్తు మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించి మొత్తం రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) 1999 కింద కేసు నమోదు చేసింది ఈడీ.
Mission Impossible : హాలీవుడ్ ‘మిషన్ ఇంపాజిబుల్’.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Also Read
- Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
- Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
నిజానికి మింత్రా అనేది, ఫ్లిప్కార్ట్ గ్రూపులో భాగంగా పనిచేస్తూ భారతీయులకు ట్రెండీ దుస్తులను అందిస్తూ మంచి బ్రాండ్ గా మారింది. అయితే, మింత్రా సంస్థ హోల్సేల్ మోడల్ లో వ్యాపారం చేస్తోందని తెలిపినా, నిజానికి మాత్రం రీటైల్ స్థాయిలో నేరుగా కస్టమర్లకు దుస్తులను అమ్ముతోందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ రకమైన మల్టీ బ్రాండ్ రీటైల్ ట్రేడింగ్ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. కానీ, మింత్రా ఎటువంటి అనుమతులు లేకుండానే పెట్టుబడులు తీసుకుందని అధికారులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేయగా అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మింత్రా తన ఉత్పత్తులను ఎక్కువగా వెక్టర్ ఈ-కామర్స్ అనే సంస్థకు అమ్మినట్లు గుర్తించారు. అయితే, ఈ వెక్టర్ సంస్థ మింత్రాకు చెందినదే అని అధికారులు గుర్తించారు. తర్వాత అదే వెక్టర్ సంస్థ ఆ వస్తువులను కస్టమర్లకు నేరుగా అమ్ముతోందని గుర్తించారు. ఈ విధంగా మింత్రా వ్యాపారాన్ని రెండు భాగాలుగా B2B (బిజినెస్ టు బిజినెస్), తరువాత B2C (బిజినెస్ టు కస్టమర్) గా చూపించి, అసలు రీటైల్ అమ్మకాలను హోల్సేల్ లావాదేవీలుగా మలచిందని ఆరోపణలు ఉన్నాయి.
Local Body Elections : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు షురూ.. కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు
అయితే, 2010లో వచ్చిన ఎఫ్డీఐ (FDI) నిబంధనల ప్రకారం, హోల్సేల్ వ్యాపారం చేసే సంస్థలు గరిష్ఠంగా 25% వ్యాపారమే తాము సంబంధం ఉన్న కంపెనీలకు మాత్రమే చేయాలి. కానీ, మింత్రా ఈ పరిమితిని మించి అధికంగా తనదైన వెక్టర్ సంస్థకే అమ్మకాలు జరిపిందని ఈడీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు 2010 నుంచి 2015 మధ్యకాలంలో జరిగిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి మాత్రమే నమోదైంది. ఈ సమయంలో మింత్రాను నడిపిన స్థాపకులు ముకేష్ బాన్సల్, అశుతోష్ లావానియా వంటి వారిపై కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఈ విషయాలపై మింత్రా ప్రతినిధులు స్పందిస్తూ.. “తాము చట్టాలను గౌరవిస్తున్నాం. అధికారులకు అవసరమైనంత సహకారం అందిస్తాం” అని తెలిపారు. మొత్తంగా ఈ ఘటన దేశంలోని ఈ-కామర్స్ రంగంపై కొత్తగా నియంత్రణలు విధించే దిశగా ప్రభుత్వ దృష్టిని సారించే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..