Myntra: మింత్రాకు ఝలక్ ఇచ్చిన ఈడీ.. రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై కేసు నమోదు..!
- మింత్రాకు ఝలక్ ఇచ్చిన ఈడీ.
- రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై కేసు.
- అధికారులకు అవసరమైనంత సహకారం అందిస్తాం.. మింత్రా ప్రతినిధులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Myntra: భారత్ లో ఆన్లైన్ సేవలను అందించే మింత్రాకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఝలక్ ఇచ్చింది. ఫ్యాషన్, సంప్రదాయ దుస్తులకు నిలయంగా మారిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మింత్రా (Myntra) ఇప్పుడు విదేశీ పెట్టుబడుల నిబంధనలను (FDI Norms) ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించి దర్యాప్తు మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించి మొత్తం రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) 1999 కింద కేసు నమోదు చేసింది ఈడీ.
Mission Impossible : హాలీవుడ్ ‘మిషన్ ఇంపాజిబుల్’.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Also Read
- Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
- Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
- EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
- MUFG Fund India: భారతీయ స్టార్టప్ సామ్రాజ్యంపై జపాన్ కన్ను.. రూ.2400 కోట్ల భారీ ఫండ్తో సరికొత్త విప్లవం!
నిజానికి మింత్రా అనేది, ఫ్లిప్కార్ట్ గ్రూపులో భాగంగా పనిచేస్తూ భారతీయులకు ట్రెండీ దుస్తులను అందిస్తూ మంచి బ్రాండ్ గా మారింది. అయితే, మింత్రా సంస్థ హోల్సేల్ మోడల్ లో వ్యాపారం చేస్తోందని తెలిపినా, నిజానికి మాత్రం రీటైల్ స్థాయిలో నేరుగా కస్టమర్లకు దుస్తులను అమ్ముతోందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ రకమైన మల్టీ బ్రాండ్ రీటైల్ ట్రేడింగ్ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. కానీ, మింత్రా ఎటువంటి అనుమతులు లేకుండానే పెట్టుబడులు తీసుకుందని అధికారులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేయగా అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మింత్రా తన ఉత్పత్తులను ఎక్కువగా వెక్టర్ ఈ-కామర్స్ అనే సంస్థకు అమ్మినట్లు గుర్తించారు. అయితే, ఈ వెక్టర్ సంస్థ మింత్రాకు చెందినదే అని అధికారులు గుర్తించారు. తర్వాత అదే వెక్టర్ సంస్థ ఆ వస్తువులను కస్టమర్లకు నేరుగా అమ్ముతోందని గుర్తించారు. ఈ విధంగా మింత్రా వ్యాపారాన్ని రెండు భాగాలుగా B2B (బిజినెస్ టు బిజినెస్), తరువాత B2C (బిజినెస్ టు కస్టమర్) గా చూపించి, అసలు రీటైల్ అమ్మకాలను హోల్సేల్ లావాదేవీలుగా మలచిందని ఆరోపణలు ఉన్నాయి.
Local Body Elections : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు షురూ.. కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు
అయితే, 2010లో వచ్చిన ఎఫ్డీఐ (FDI) నిబంధనల ప్రకారం, హోల్సేల్ వ్యాపారం చేసే సంస్థలు గరిష్ఠంగా 25% వ్యాపారమే తాము సంబంధం ఉన్న కంపెనీలకు మాత్రమే చేయాలి. కానీ, మింత్రా ఈ పరిమితిని మించి అధికంగా తనదైన వెక్టర్ సంస్థకే అమ్మకాలు జరిపిందని ఈడీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు 2010 నుంచి 2015 మధ్యకాలంలో జరిగిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి మాత్రమే నమోదైంది. ఈ సమయంలో మింత్రాను నడిపిన స్థాపకులు ముకేష్ బాన్సల్, అశుతోష్ లావానియా వంటి వారిపై కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఈ విషయాలపై మింత్రా ప్రతినిధులు స్పందిస్తూ.. “తాము చట్టాలను గౌరవిస్తున్నాం. అధికారులకు అవసరమైనంత సహకారం అందిస్తాం” అని తెలిపారు. మొత్తంగా ఈ ఘటన దేశంలోని ఈ-కామర్స్ రంగంపై కొత్తగా నియంత్రణలు విధించే దిశగా ప్రభుత్వ దృష్టిని సారించే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
-
Power Saving Tips: ఏసీ కాదు..కూలర్ కాదు.. మీ సీలింగ్ ఫ్యాన్తోనే కరెంట్ బిల్లు వాచిపోద్ది..ఎలాగంటే?
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్లో సూర్య..
-
Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!