TATA War: టాటా గ్రూప్లో అంతర్యుద్ధం.. అమిత్ షా దగ్గరకు పంచాయితీ
- టాటా గ్రూప్లో అంతర్యుద్ధం
- అమిత్ షా దగ్గరకు పంచాయితీ
- మునుపటిలా కలిసి మెలిసి ఉండాలని కేంద్రం సలహా
టాటా ట్రస్ట్లో కొద్ది నెలలుగా కొన్నసాగుతున్న అంతర్యుద్ధం తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్గత విభేదాలు టాటా గ్రూప్ వాతావరణాన్ని ఛిన్నాభిన్నం చేసి అశాంతికి దారి తీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల జరిగిన టాటా గ్రూప్ భేటీ వేదికైంది. రతన్ టాటా మరణించిన ఏడాది తర్వాత సెప్టెంబర్ 11న జరిగిన టాటా ట్రస్టుల సమావేశంలో విభేదాలు బయటపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Pakistan-US: అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసే యోచనలో పాక్!
Also Read
- Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
- Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
- Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..
- Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..
అయితే ప్రస్తుతం టాటా గ్రూప్లో తలెత్తిన సమస్యను పరిష్కరించాలని కేంద్ర నాయకత్వాన్ని టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా కోరినట్లు సమాచారం. దీంతో కేంద్ర పెద్దలు రంగంలోకి దిగి మంతనాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ వారం ఢిల్లీలో ఇద్దరు సీనియర్ కేబినెట్ మంత్రులు.. నలుగురు టాప్ టాటా అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. నోయెల్ టాటా (టాటా ట్రస్ట్స్ చైర్మన్), వేణు శ్రీనివాసన్ (టాటా ట్రస్ట్స్ వైస్ చైర్మన్), ఎన్ చంద్రశేఖరన్ (టాటా సన్స్ చైర్మన్), డారియస్ ఖంబాటా (టాటా ట్రస్ట్స్ ట్రస్టీ)తో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వలేనట్లు వినికిడి.
ఇది కూడా చదవండి: Trump-Mark Carney: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారు.. ట్రంప్పై కెనడా ప్రధాని ప్రశంసలు
విభేదాలు కొలిక్కి రాకపోవడంతో తాజాగా ఈ పంచాయితీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గరకు చేరింది. దాదాపు గంట సేపు టాటా ట్రస్ట్ ముఖ్యనేతలతో అమిత్ షా చర్చలు జరిపారు. అంతర్గత విభేదాలు విడిచిపెట్టాలని.. మునుపటిలాగానే కలిసి మెలిసి పని చేయాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. అయితే విభేదాలకు కారణమైన చర్యలను ప్రస్తుతం పక్కన పెట్టి నిర్ణయాత్మక చర్యల దిశగా ముందుకు సాగిపోవాలని సూచించినట్లు సమాచారం. మెజారిటీ వాటా ‘ప్రజా బాధ్యత’ అని అమిత్ షా, నిర్మలా సీతారామన్ టాటా ప్రతినిధులకు సూచించినట్లు తెలుస్తోంది.
టాటా గ్రూప్ భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీ. దేశ ప్రజల మన్ననలు పొందిన కంపెనీ. అలాంటి కంపెనీలో తీవ్ర విభేదాలు చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అక్టోబర్ 9, 2024న రతన్ టాటా మరణించారు. గురువారం రతన్ టాటా మొదటి వర్ధంతి జరగనుంది. రెండు రోజుల పాటు స్మారక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్యుద్ధం సాగుతున్న నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి టాటా గ్రూప్ నాయకులు వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతారా? లేదంటే ఎడముఖం..పెడముఖం పెడతారో చూడాలి. కేంద్ర పెద్దల సలహాలను ఎంత వరకు గౌరవిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!