TATA War: టాటా గ్రూప్లో అంతర్యుద్ధం.. అమిత్ షా దగ్గరకు పంచాయితీ
- టాటా గ్రూప్లో అంతర్యుద్ధం
- అమిత్ షా దగ్గరకు పంచాయితీ
- మునుపటిలా కలిసి మెలిసి ఉండాలని కేంద్రం సలహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాటా ట్రస్ట్లో కొద్ది నెలలుగా కొన్నసాగుతున్న అంతర్యుద్ధం తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్గత విభేదాలు టాటా గ్రూప్ వాతావరణాన్ని ఛిన్నాభిన్నం చేసి అశాంతికి దారి తీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల జరిగిన టాటా గ్రూప్ భేటీ వేదికైంది. రతన్ టాటా మరణించిన ఏడాది తర్వాత సెప్టెంబర్ 11న జరిగిన టాటా ట్రస్టుల సమావేశంలో విభేదాలు బయటపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Pakistan-US: అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసే యోచనలో పాక్!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
అయితే ప్రస్తుతం టాటా గ్రూప్లో తలెత్తిన సమస్యను పరిష్కరించాలని కేంద్ర నాయకత్వాన్ని టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా కోరినట్లు సమాచారం. దీంతో కేంద్ర పెద్దలు రంగంలోకి దిగి మంతనాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ వారం ఢిల్లీలో ఇద్దరు సీనియర్ కేబినెట్ మంత్రులు.. నలుగురు టాప్ టాటా అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. నోయెల్ టాటా (టాటా ట్రస్ట్స్ చైర్మన్), వేణు శ్రీనివాసన్ (టాటా ట్రస్ట్స్ వైస్ చైర్మన్), ఎన్ చంద్రశేఖరన్ (టాటా సన్స్ చైర్మన్), డారియస్ ఖంబాటా (టాటా ట్రస్ట్స్ ట్రస్టీ)తో కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వలేనట్లు వినికిడి.
ఇది కూడా చదవండి: Trump-Mark Carney: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారు.. ట్రంప్పై కెనడా ప్రధాని ప్రశంసలు
విభేదాలు కొలిక్కి రాకపోవడంతో తాజాగా ఈ పంచాయితీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గరకు చేరింది. దాదాపు గంట సేపు టాటా ట్రస్ట్ ముఖ్యనేతలతో అమిత్ షా చర్చలు జరిపారు. అంతర్గత విభేదాలు విడిచిపెట్టాలని.. మునుపటిలాగానే కలిసి మెలిసి పని చేయాలని అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. అయితే విభేదాలకు కారణమైన చర్యలను ప్రస్తుతం పక్కన పెట్టి నిర్ణయాత్మక చర్యల దిశగా ముందుకు సాగిపోవాలని సూచించినట్లు సమాచారం. మెజారిటీ వాటా ‘ప్రజా బాధ్యత’ అని అమిత్ షా, నిర్మలా సీతారామన్ టాటా ప్రతినిధులకు సూచించినట్లు తెలుస్తోంది.
టాటా గ్రూప్ భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీ. దేశ ప్రజల మన్ననలు పొందిన కంపెనీ. అలాంటి కంపెనీలో తీవ్ర విభేదాలు చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అక్టోబర్ 9, 2024న రతన్ టాటా మరణించారు. గురువారం రతన్ టాటా మొదటి వర్ధంతి జరగనుంది. రెండు రోజుల పాటు స్మారక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అంతర్యుద్ధం సాగుతున్న నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి టాటా గ్రూప్ నాయకులు వర్ధంతి కార్యక్రమానికి హాజరవుతారా? లేదంటే ఎడముఖం..పెడముఖం పెడతారో చూడాలి. కేంద్ర పెద్దల సలహాలను ఎంత వరకు గౌరవిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!