Central Govt: ఎట్టకేలకు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు , గ్రామీణ ప్రాంతాల వారికి ఎన్నో తీపి కబుర్లు అందించింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, సామాన్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ భేటీలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించడం, సముద్ర రవాణాను మరింత సురక్షితం చేయడం మరియు గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలకు ఈ సమావేశంలో పెద్దపీట వేశారు. రాజకీయంగా కూడా మహిళా సాధికారత అంశంపై ఈ భేటీలో చర్చ జరగడం విశేషం.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కరువు భత్యాన్ని (డీఏ) 2 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సెప్టెంబర్ చివరిలో రావాల్సిన ఈ ప్రకటన కొంత ఆలస్యం కావడంతో ఉద్యోగుల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఏటా రెండుసార్లు ప్రభుత్వం ఈ పెంపును చేపడుతుంది. సముద్ర రంగంలో భద్రత కోసం రూ. 13,000 కోట్లతో సావరిన్ మారిటైమ్ ఫండ్ను ఏర్పాటు చేయడం మరో ముఖ్యమైన నిర్ణయం.
Also Read
- Sugar Price Hike: షుగర్ ధరల్లో రికార్డు జంప్.. 18 రోజుల్లో ఇంత పెరిగిందా?
- SBI New Withdrawal Rules: మీకు SBIలో ఈ ఖాతా ఉందా..? విత్డ్రాయల్పై కొత్త ఛార్జీలు.. నయా రూల్స్ ఇవే
- RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
- Banking for Youth Campaign: నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు.. యువత కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రత్యేక కార్యక్రమాలు
Also Read:Tech Layoffs 2026: మీరు ఐటీ ఉద్యోగులా? అయితే ఈ రిపోర్ట్ చదవాల్సిందే.. 5 ఏళ్లలో 10 లక్షల మంది ఇంటికి!
ఇది భారతీయ నౌకలకు తక్కువ ధరకే బీమా సౌకర్యం కల్పిస్తూ, అంతర్జాతీయ వాణిజ్యానికి అండగా నిలుస్తుంది. అదేవిధంగా.. గ్రామాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రధాని గ్రామ సడక్ యోజనను 2028 వరకు పొడిగిస్తూ మరో రూ. 3,000 కోట్లు కేటాయించారు. చివరగా.. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాల తీరును ప్రధాని ఖండిస్తూ, మహిళల హక్కుల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!