PM Mudra Yojana: పైసా గ్యారెంటీ లేకుండా రూ.20 లక్షల రుణం.. అవకాశం మిస్ అవ్వకండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Mudra Yojana: ఈ రోజుల్లో పైసా గ్యారెంటీ లేకుండా సొంత వాళ్లే రూపాయి కూడా ఇవ్వడం లేదు. అలాంటిది ఎలాంటి గ్యారెంటీ, షురిటీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణం ఇస్తున్న విషయం మీకు తెలుసా.. ఇది నిజంగా నిజమైన వార్త. ఈ రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఇంతకీ ఈ రుణం ఇచ్చేది ఎవరో మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: NABARD Recruitment 2026: నాబార్డ్లో డెవలప్మెంట్ అసిస్టెంట్ జాబ్స్.. గ్రాడ్యుయేట్స్ కి మంచి ఛాన్స్
Also Read
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
కేంద్ర ప్రభుత్వం యువతకు, వ్యాపారం ప్రారంభించడానికి ఆసక్తి ఉన్నవారికి సహాయం చేస్తోంది. ఎవరైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి రూ.20 లక్షల వరకు రుణాలను అందిస్తోంది. ఈ రుణానికి ఎటువంటి హామీ అవసరం లేదు. ఇది పూర్తిగా పూచీకత్తు లేని రుణం. నిజానికి కేంద్రం అమలు చేస్తున్న ఈ ప్రభుత్వ పథకం గతంలో రూ.10 లక్షల వరకు మాత్రమే రుణాలను అందించింది. కానీ ఇప్పుడు ఈ పథకంలో భాగంగా రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. FY2024-25 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రుణ పరిమితిని రూ.20 లక్షలకు రెట్టింపు చేసినట్లు వెల్లడించారు. ఇంతకీ ఈ ప్రభుత్వ పథకం పేరు ఏంటో తెలుసా.. ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY). ఈ ప్రభుత్వ పథకం నాలుగు కేటగిరిల్లో వ్యాపారాలకు రుణాలు అందిస్తుంది. తద్వారా వారు కాలక్రమేణా తమ వ్యాపారాలను విస్తరించుకోవచ్చు. శిశు కేటగిరీ కింద రూ.50,000 రుణం, కిషోర్ కేటగిరీ కింద రూ.50,000 నుంచి రూ.5లక్షల వరకు, తరుణ్ కేటగిరీ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, తరుణ్ ప్లస్ కింద రూ.10 నుంచి 20 లక్షల వరకు రుణం అందజేస్తారు.
ప్రధానమంత్రి ముద్ర యోజనను మోడీ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారి కోసం రూపొందించినది. 8వ తరగతి ఉత్తీర్ణులైనా, ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి దరఖాస్తు చేసుకోడానికి ఎటువంటి విద్యా అర్హతలు అవసరం లేదు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటో, వ్యాపార ప్రణాళిక, KYC పత్రం, ఆదాయ రుజువు కలిగి ఉండటం అవసరం. దరఖాస్తు చేసుకోడానికి ఆసక్తి గల వారు https://www.mudra.org.in/ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మీరు బ్యాంకుల ద్వారా కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
READ ALSO: Karumuru Venkat Reddy: నువ్వుమైనా సుప్పిని శుద్దపూసవా.. రాధాకృష్ణ రాతలపై కారుమూరు సీరియస్..!
తాజావార్తలు
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
-
Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
-
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..