Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Business Headlines 5g Plans May Be Priced 10 20 Higher Than 4g

Business Headlines: 5జీ వస్తే 10-20 శాతం పెరగనున్న మొబైల్‌ డేటా ఛార్జీలు

Published Date :July 21, 2022 , 12:23 pm
By Akkirala Kondala Rao
Business Headlines: 5జీ వస్తే 10-20 శాతం పెరగనున్న మొబైల్‌ డేటా ఛార్జీలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Business Headlines: 4,500 మంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌

ఎయిరిండియాలో వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకునేందుకు 4 వేల 500 మంది పర్మనెంట్‌ ఉద్యోగులు ముందుకొచ్చారు. జూన్‌, జూలై నెలల్లో వీఆర్‌ఎస్‌కి అప్లై చేసేవాళ్లకి ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. వీఆర్‌ఎస్‌ అర్హత వయసును సైతం 55 ఏళ్ల నుంచి 40 ఏళ్లకి తగ్గించింది.

Also Read

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
  • Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
  • Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
  • Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..

రెమిటెన్స్‌లో ఇండియా టప్‌

విదేశాల నుంచి ఎక్కువ చెల్లింపులు పొందుతున్న దేశాల్లో ఇండియా టాప్‌లో నిలిచింది. గతేడాది మన దేశం ఇతర దేశాల నుంచి 87 బిలియన్‌ డాలర్ల రెమిటెన్స్‌ను స్వీకరించింది. తద్వారా చైనా, మెక్సికో దేశాలను వెనక్కి నెట్టింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది.

5జీకి 10-20 శాతం ఎక్కువ ఛార్జ్‌

4జీ మొబైల్‌ డేటా ప్లాన్లతో పోల్చితే 5జీ డేటా ప్లాన్లకి 10 నుంచి 20 శాతం ఎక్కువ ఛార్జ్‌ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కో వినియోగదారుడి నుంచి సగటున వసూలు చేసే రెవెన్యూని పెంచుకుందుకు టెలికం కంపెనీలు ఈ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. 5జీ సర్వీస్‌ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లేనే ఈ ఛార్జ్‌ని వసూలు చేయొచ్చని, తర్వాత మరింత పెంచొచ్చని అంచనా వేస్తున్నారు.

షేర్లకు ‘విండ్‌ఫాల్‌’ బూస్ట్‌

ఇంధన ఎగుమతులపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ని తగ్గించటం ఆయిల్‌ కంపెనీలకు, ప్రొడ్యూజర్లకు బాగా కలిసొచ్చింది. ముఖ్యంగా రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేర్లు 2 పాయింట్‌ 5 శాతం లాభపడ్డాయి. విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ని తగ్గించటం ఆయా కంపెనీల షేర్లకు సెంటిమెంటల్‌గా మరింత వర్కౌట్‌ కానుందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

14 శాతం పెరిగిన గోధుమల ధరలు

గోధుమల ధరలు గత 6 వారాల్లో 14 శాతం పెరిగాయి. వర్షాల వల్ల సప్లై తగ్గటం, మిల్లింగ్‌ డిమాండ్‌ పెరగటమే దీనికి కారణమని అంటున్నారు. ఈ నేపథ్యంలో గోధుమ పిండి, మైదా, బిస్కెట్లు, బ్రెడ్‌ తదితర ఉత్పత్తుల ధరలు పెరగొచ్చని భావిస్తున్నారు. ఈ మార్పును సరిగా అంచనా వేయలేక స్టాక్‌ మార్కెట్లలోని చిన్న వ్యాపారులు షేర్లను అమ్ముకోగా పెద్ద వ్యాపారులు మాత్రం అట్టిపెట్టుకున్నారు.

గోల్డ్‌మన్‌ శాక్స్‌కు మాంద్యం భయం

గోల్డ్‌మన్‌ శాక్స్‌ వచ్చే రెండేళ్లలో 50 శాతం మాంద్యంలో కూరుకుపోయే అవకాశం ఉందని ఎకనమిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ బ్యాంక్‌ సీఈఓ డేవిడ్‌ సోలోమన్‌ మాత్రం వచ్చే ఏడాది కాలంలోనే 30 శాతం మాంద్యంలో చిక్కుకోవచ్చని పేర్కొన్నారు.

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమైనప్పటికీ త్వరగానే కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 150 పాయింట్లు పెరిగి ప్రస్తుతం 55,530 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 16,560 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ల వ్యాల్యూ 0.9 శాతం పెరిగింది. గ్లాండ్‌ ఫార్మా కంపెనీ స్టాక్స్‌ 11 శాతం లాభపడ్డాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 4g plans
  • 5g plans
  • air india
  • CEO David Solomon
  • Goldman Sachs

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions