Site icon NTV Telugu

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సంచలనం.. భారీగా పెరిగిన సబ్‌స్క్రైబర్లు

Bsnl

Bsnl

ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీలో వెనుకబడిన ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇప్పుడు మంచిరోజులు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా కంపెనీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య వేగంగా పెరిగింది. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్‌ ఐడియా ఇటీవల టారిఫ్‌లను పెంచడంతో పెద్ద సంఖ్యలో కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారుతున్నారు. టెలికాం రెగ్యులేటర్ ట్రైయి తాజా డేటా ప్రకారం.. బీఎస్‌ఎన్‌ఎల్ యొక్క కస్టమర్ బేస్ గత రెండు నెలల్లో పెరుగుతోంది. తక్కువ టారిఫ్‌లు, 4జీ సేవల యొక్క ‘సాఫ్ట్ లాంచ్’ కూడా దీనికి దోహదపడ్డాయి.

READ MORE: Minister Nimmala Rama Naidu: నవంబర్ రెండవ వారంలో సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శన

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో సహా అన్ని ఇతర కంపెనీల వినియోగదారుల సంఖ్య క్షీణించగా, బీఎస్‌ఎన్‌ఎల్ జూలైలో దాదాపు 30 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఎయిర్‌టెల్ 17 లక్షల మంది, వోడా ఐడియా 14 లక్షలు, జియో 8 లక్షల మంది వినియోగదారులను కోల్పోయారు. ఆగస్ట్‌లో కూడా వినియోగదారుల సంఖ్య పెరిగిన ఏకైక సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్. ఈ నెలలో 25 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఈ కాలంలో జియో 40 లక్షల మంది, ఎయిర్‌టెల్ 24 లక్షలు, వోడా ఐడియా 19 లక్షల మంది వినియోగదారులను కోల్పోయాయి.

READ MORE:IND vs NZ: టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడం నిరాశపరిచింది.. ఓటమికి కారణం చెప్పిన రోహిత్

బీఎస్‌ఎన్‌ఎల్ మార్కెట్ వాటా
మొత్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ మార్కెట్ వాటా దాని పెద్ద ప్రైవేట్ ప్రత్యర్థులతో పోలిస్తే ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి జియో 40.5% మార్కెట్ వాటాతో ముందంజలో ఉండగా, ఎయిర్‌టెల్ 33%, వొడాఫోన్ ఐడియా 18% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ వాటా 7.8%గా ఉందని ట్రైయి తెలిపింది.

Exit mobile version