Michelle poonawalla: ముంబైలో రూ.500 కోట్లతో ఇల్లు కొనుగోలు చేసిన బిలియనీర్ దంపతులు
- ముంబైలో ఖరీదైన ఇల్లు కొలుగోలు చేసిన బిలియనీర్ దంపతులు
- 500 కోట్లతో ఇల్లు కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ యోహాన్ పూనావాలా, భార్య మిచెల్ ముంబైలో ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో రూ.500 కోట్లకు 30,000 చదరపు అడుగుల విస్తీరణంలో ఆస్తిని కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలో అత్యంత ఖరీదైన నివాసం ఇదే కావడం విశేషం. దీనికి ‘పూనావాలా మాన్షన్’ అని నామకరణం చేశారు.
యోహాన్ పూనావాలా ఇంజినీరింగ్ గ్రూప్ ఛైర్మన్. పూనావాలా పేరుపై అనేక కంపెనీలు ఉన్నాయి. ఇతని తండ్రి జవరాయ్ పూనావాలా కూడా ప్రముఖ పారిశ్రామిక వేత్త. ప్రముఖ టీకా తయారీదారు అయిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సహ-స్థాపించారు. ఇక యోహాన్ పూనావాలా భార్య మిచెల్ కూడా ఇంజనీరింగ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆమె డిజైన్ సంస్థ నిర్వహిస్తున్నారు.
Also Read
- Mark Zuckerberg: జుకర్బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
తాజాగా కొనుగోలు చేసిన భవనంలో విశాలమైన లేఅవుట్ ఉంది. విశాలమైన డాబాలు, బహుళ అంతస్తులు కలిగి ఉంది. విలాసవంతమైన సెట్టింగ్, విస్తృతమైన కళాఖండాలు ఉన్నాయి. మిచెల్ పూనావాలా యొక్క ప్రత్యేకమైన ఆయిల్ పెయింటింగ్లు మరియు ఇతర విలువైన మొక్కలు ఉన్నాయి. నివాసంలో కొంత భాగాన్ని ప్రైవేట్ ఆర్ట్ గ్యాలరీగా మార్చారు.
దక్షిణ ముంబైలో ఇటీవల సెలబ్రిటీల ఆస్తుల కొనుగోళ్లు బాగా పెరిగాయి. క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ కూడా ఈ ప్రాంతాల్లోనే ఇళ్లులు కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లీ ‘ఓంకార్ 1973’ ప్రాజెక్ట్లో రూ. 34 కోట్లకు విలాసవంతమైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. రోహిత్ శర్మ వర్లీలోని అహుజా టవర్స్లో రూ. 30 కోట్ల ఆస్తిని సంపాదించారు. యువరాజ్ సింగ్ కూడా అదే పరిసరాల్లో రూ 64 కోట్ల ఆస్తిని కొనుగోలు చేశారు. అలాగే చలనచిత్ర నిర్మాత, దర్శకుడు దినేష్ విజన్ కూడా దక్షిణ ముంబైలోని ప్రముఖ ఆస్తి యజమానుల జాబితాలో చేరారు. 9,000 చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. సుహానా ఖాన్ అలీబాగ్లోని 1.5 ఎకరాల వ్యవసాయ భూమిని రూ. 12.91 కోట్లకు కొనుగోలు చేశారు. అలియా భట్ యొక్క ప్రొడక్షన్ హౌస్ బాంద్రాలోని 2,497 చదరపు అడుగుల అపార్ట్మెంట్ను రూ. 37.80 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. ఇలా సెలబట్రీలంతా ఖరీదైన ఇల్లులను కొనుగోలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..