మార్కప్ ఛార్జీల పేరిట రూ.9,700 కోట్లు కొల్లగొట్టిన బ్యాంకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిడెన్ ఛార్జీల పేరుతో బ్యాంకులు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నాయి. ఉద్యోగాల కోసం, ఉన్నత చదువుల కోసం, వైద్యం కోసం, తమ బంధువుల కోసం, సొంత పర్యటనల చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటారు. ఆయా దేశాల్లో మన కరెన్సీ చెల్లదు కాబట్టి మన డబ్బును ఇచ్చి ఆయా దేశాల కరెన్సీని తీసుకుంటారు. ఇలా డబ్బును బదిలీ చేసే వారిపై ప్రాసెసింగ్ ఫీజు, మార్కప్ ఫీజుల పేరుతో బ్యాంకులు హిడెన్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటూ క్యాపిటల్ ఎకానమిక్స్ అనే సంస్థ బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో ఒక్క 2021 సంవత్సరంలోనే విదేశాలకు వెళ్లే భారతీయులు దాదాపు రూ.95వేల కోట్లు (1270 కోట్ల డాలర్లు) ట్రాన్స్ఫర్ చేశారు. సదరు డబ్బులో 380 కోట్ల డాలర్లను ఉన్నత విద్య కోసం పంపగా.. పర్యటనల కోసం 320 కోట్ల డాలర్లు, ఫ్యామిలీ సపోర్ట్ కోసం 270 కోట్ల డాలర్లను భారతీయులు పంపారు.
Read Also: వంట గ్యాస్ ధరల మంట.. మరో రూ.100 పెరిగే అవకాశం
Also Read
- RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
- SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్డాక్పై
- Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
అయితే గతంలో భారతీయులు పంపే డబ్బులపై బ్యాంకులు అధికంగా ఛార్జీలు వసూలు చేసేవి. అయితే గత ఐదేళ్లుగా ఆ ఛార్జీలు తగ్గించి కేవలం ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వసూలు చేస్తున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. దీంతో 2016లో ప్రాసెసింగ్ ఫీజుల కింద బ్యాంకులు రూ.15,017 కోట్లు ఆర్జిస్తే.. 2019లో రూ.12,142 కోట్లు మాత్రమే ఆర్జించాయి. దీంతో ఆ లోటును పూడ్చుకునేందుకు బ్యాంకులు ఎక్స్ఛేంజ్ మార్కప్ పేరుతో ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఛార్జీలను బ్యాంకులు భారీగా పెంచేశాయి. వాటి ద్వారా 2016లో బ్యాంకులకు రూ.2,505 కోట్లు రాగా 2019లో రూ.4,422 కోట్లు సమకూరాయి. 2020లో అయితే ఏకంగా రూ.9,700 కోట్లను బ్యాంకులు కొల్లగొట్టాయి. విదేశాలకు భారతీయులు పంపిన డబ్బులో ప్రాసెసింగ్ ఫీజు ద్వారా బ్యాంకులు రూ.26,300 కోట్లు సంపాదించాయి. ఇందులో మార్కప్ ఛార్జీల వాటా 36 శాతంగా ఉంది. ఈ ఛార్జీల గురించి చాలా మంది వినియోగదారులకు తెలియదు. బ్యాంకులు వసూలు చేస్తున్న ఈ ఛార్జీల దోపిడీ వల్ల ఎక్కువ నష్టపోతున్న వారిలో గల్ఫ్ దేశాలకు చెందిన కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!