Arvind Krishna: రోజుకు రూ. 45 లక్షల జీతం తీసుకుంటున్న తెలుగు తేజం!
- ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ
- ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న కొద్దిమంది ఎగ్జిక్యూటివ్లలో ఒకరు
- రోజుకు రూ. 45 లక్షల జీతం
- వార్షిక ప్యాకేజీ దాదాపు రూ.165 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ. ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న కొద్దిమంది ఎగ్జిక్యూటివ్లలో ఆయన కూడా ఉన్నారు. ఆయన వార్షిక ప్యాకేజీ దాదాపు రూ.165 కోట్లు. ఈ విధంగా రోజుకు దాదాపు రూ.45 లక్షలు సంపాదిస్తున్నారు. 2023లో ఆయన జీతం రూ.30 కోట్లు భారీగా పెరిగింది. కృష్ణ 1990 నుంచి ఐబీఎమ్ తో అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన కంపెనీలో 34 ఏళ్లుగా పనిచేస్తున్నారు. 2020లో సీఈవో అయినప్పటి నుంచి.. ఆయన కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అరవింద్ కృష్ణ కథ సినిమా కథ కంటే తక్కువేం కాదు. 1990లోఐబీఎంలో చేరిన తర్వాత కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేశారు. సీఈవో కాకముందు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన నాయకత్వంలో.. ఐబీఎమ్ రెడ్ హట్(IBM Red Hat)ని $34 బిలియన్లకు కొనుగోలు చేసింది. ఇది ఒక ముఖ్యమైన విజయం. ఇదొక్కటే కాదు.. కృష్ణ పేరు మీద 15 పేటెంట్లు కూడా ఉన్నాయి. ఇది ఆయన సాంకేతిక చతురతకు నిదర్శనం.
READ MORE: Nara Lokesh: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో వెనుకబడిన ఏపీ వర్సిటీలు.. మంత్రి లోకేష్ అసంతృప్తి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ..
అరవింద్ కృష్ణ ఆంధ్ర ప్రదేశ్ నివాసి. ఆయన తండ్రి ఇండియన్ ఆర్మీలో అధికారి. తల్లి సైనిక వితంతువుల సంక్షేమం కోసం కృషి చేశారు. తెలుగు మాట్లాడే కుటుంబంలో పెరిగిన కృష్ణ తన పాఠశాల విద్యను తమిళనాడు, డెహ్రాడూన్లలో పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ కాన్పూర్లో అడ్మిషన్ తీసుకున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఇక్కడే ఆయనకి ఐబిఎమ్లో ఉద్యోగం వచ్చింది. అది ఆయన జీవితాన్ని మార్చింది. కృష్ణ నాయకత్వంలో ఐబిఎమ్ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా మారింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 1,450,000 కోట్ల కంటే ఎక్కువ. కంపెనీని ముందుకు తీసుకెళ్లడంలో కృష్ణ ఎంత ముఖ్యమైన పాత్ర పోషించాడో జీతం పెరుగుదల తెలియజేస్తుంది. ఐబిఎమ్ ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!