AI: దిగ్గజ కంపెనీల AI పెట్టుబడులు.. ఏకంగా భారత్ బడ్జెట్కు సమానం..
- ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న టెక్ కంపెనీలు..
- అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ పెట్టుబడులు $650 బిలియన్లు..
- భారత బడ్జెట్ కు సమానంగా ఏఐ పెట్టుబడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI: ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ ఉద్యోగుల్ని తీసేసి, ఏఐపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఏకంగా భారత బడ్జెట్కు దాదాపుగా సమానమైన పెట్టుబడుల్ని కేవలం నాలుగు కంపెనీలే పెడుతున్నాయంటే ఏ రేంజ్లో ఏఐ బూమ్ ఉందో తెలుస్తోంది. ఏఐ, దాని అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ ఏకంగా 650 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని పెడుతున్నాయి. ఇటీవల, మన కేంద్ర బడ్జెట్ సుమారుగా 670 బిలియన్ డాలర్లు.
AIపై భారీ పెట్టుబడులు:
Also Read
- Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
- UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
- Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
అయితే, టెక్ కంపెనీలు చెబుతున్న ఈ లెక్క కేవలం అంచనా మాత్రమే. దీని కన్నా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. దీనిని బట్టి చూస్తే భారత్ బడ్జెట్ కేటాయింపుల కన్నా ఏఐపై దిగ్గజ కంపెనీలు పెడుతున్న పెట్టుబడులు అధికం. అమెజాన్ $200 బిలియన్, గూగుల్ $175–185 బిలియన్లు, మెటా $115–135 బిలియన్లు, మైక్రోసాఫ్ట్ $115–135 బిలియన్లు ఖర్చు చేస్తామని ప్రకటించాయి. ఈ మొత్తం ఖర్చు ప్రధానంగా డేటా సెంటర్లు, సూపర్కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI చిప్లు, సర్వర్లు, క్లౌడ్ టెక్నాలజీల కోసం వినియోగించుతామని చెబుతున్నాయి.
ఏఐ రంగంలో గెలిచిన వారికే టెక్ రంగంలో ఆధిపత్యం. దీంతోనే అనేక కంపెనీలు ఏఐపై దృష్టిపెట్టాయి, భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ మాట్లాడుతూ.. ప్రతీ కస్టమర్ అనుభవం ఏఐతో ముడిపడి ఉందని, అందు కోసమే తాము అగ్రెసివ్గా పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు.
ఉద్యోగాలను తినేస్తున్న AI:
ఇదిలా ఉంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ఉద్యోగాలను తినేస్తోంది. ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన ఆంథ్రోపిక్ సీఈఓ చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో గుబులు పెంచుతున్నాయి. వచ్చే కొన్ని రోజుల్లో టెక్కీలను రీప్లేస్ చేసే ఏఐ మోడల్స్ వస్తాయని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటి వరకు అమెజాన్ 30,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. మైక్రోసాఫ్ట్ 9000 మందిని, మెటా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో 10 శాతం సిబ్బందిని తగ్గించింది. ఏఐ వల్ల రాబోయే కాలంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!