AI: దిగ్గజ కంపెనీల AI పెట్టుబడులు.. ఏకంగా భారత్ బడ్జెట్కు సమానం..
- ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న టెక్ కంపెనీలు..
- అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ పెట్టుబడులు $650 బిలియన్లు..
- భారత బడ్జెట్ కు సమానంగా ఏఐ పెట్టుబడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI: ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ ఉద్యోగుల్ని తీసేసి, ఏఐపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఏకంగా భారత బడ్జెట్కు దాదాపుగా సమానమైన పెట్టుబడుల్ని కేవలం నాలుగు కంపెనీలే పెడుతున్నాయంటే ఏ రేంజ్లో ఏఐ బూమ్ ఉందో తెలుస్తోంది. ఏఐ, దాని అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ ఏకంగా 650 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని పెడుతున్నాయి. ఇటీవల, మన కేంద్ర బడ్జెట్ సుమారుగా 670 బిలియన్ డాలర్లు.
AIపై భారీ పెట్టుబడులు:
Also Read
- మీకు PM Kisan డబ్బులు రావట్లేదా? ఈ కారణాలే వాటిని ఆపేస్తున్నాయట!
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
అయితే, టెక్ కంపెనీలు చెబుతున్న ఈ లెక్క కేవలం అంచనా మాత్రమే. దీని కన్నా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. దీనిని బట్టి చూస్తే భారత్ బడ్జెట్ కేటాయింపుల కన్నా ఏఐపై దిగ్గజ కంపెనీలు పెడుతున్న పెట్టుబడులు అధికం. అమెజాన్ $200 బిలియన్, గూగుల్ $175–185 బిలియన్లు, మెటా $115–135 బిలియన్లు, మైక్రోసాఫ్ట్ $115–135 బిలియన్లు ఖర్చు చేస్తామని ప్రకటించాయి. ఈ మొత్తం ఖర్చు ప్రధానంగా డేటా సెంటర్లు, సూపర్కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, AI చిప్లు, సర్వర్లు, క్లౌడ్ టెక్నాలజీల కోసం వినియోగించుతామని చెబుతున్నాయి.
ఏఐ రంగంలో గెలిచిన వారికే టెక్ రంగంలో ఆధిపత్యం. దీంతోనే అనేక కంపెనీలు ఏఐపై దృష్టిపెట్టాయి, భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ మాట్లాడుతూ.. ప్రతీ కస్టమర్ అనుభవం ఏఐతో ముడిపడి ఉందని, అందు కోసమే తాము అగ్రెసివ్గా పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు.
ఉద్యోగాలను తినేస్తున్న AI:
ఇదిలా ఉంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ఉద్యోగాలను తినేస్తోంది. ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన ఆంథ్రోపిక్ సీఈఓ చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో గుబులు పెంచుతున్నాయి. వచ్చే కొన్ని రోజుల్లో టెక్కీలను రీప్లేస్ చేసే ఏఐ మోడల్స్ వస్తాయని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటి వరకు అమెజాన్ 30,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. మైక్రోసాఫ్ట్ 9000 మందిని, మెటా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో 10 శాతం సిబ్బందిని తగ్గించింది. ఏఐ వల్ల రాబోయే కాలంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!