హైదరాబాద్లో ఘనంగా 15వ ఇండియన్ మెమరీ ఛాంపియన్షిప్
- స్క్వాడ్రన్ లీడర్ జయసింహ నేతృత్వంలోని ఘనంగా ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్
- వైరల్పే ద్వారా స్పాన్సర్ చేయబడిన 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్
- పాల్గొన్న 3 దేశాలు.. 13 రాష్ట్రాలు.. 59 నగరాలు.. 74 పాఠశాలల నుండి 180 మంది
స్క్వాడ్రన్ లీడర్ జయసింహ నేతృత్వంలోని ఘనంగా ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్, వైరల్పే ద్వారా స్పాన్సర్ చేయబడిన 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ను అక్టోబర్ 20, 2024న హైదరాబాద్లో విజయవంతంగా నిర్వహించింది. ఈ ఛాంపియన్షిప్లో 3 దేశాలు, 13 రాష్ట్రాలు, 59 నగరాలు , 74 పాఠశాలల నుండి 180 మంది పాల్గొన్నారు. అందులో 60 సంవత్సరాల పైబడిన 10 మందికి పైగా మంది పాల్గొన్నారు. హైదర్నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , ASWA ఫౌండేషన్ నుండి ముఖ్యంగా 10 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈవెంట్ స్పాన్సర్గా ముందుకు వచ్చిన ViralPe చైర్మన్ Mr. P R మాట్లాడుతూ బిజినెస్కి చాలా కష్టమైన సేల్స్ని సులభతరం చెయ్యడానికి ఎలాగైతే ViralPe Sales and Services ని తీసుకురాబోతున్నామో, అలాగే చదివింది చాలా సులభతరంగా గుర్తుండడానికి ఈ మెమోరీ టెక్నిక్స్ చాలా సహాయపడతాయని, విద్యార్థులందరికీ ఈ టెక్నిక్స్ ని చేరవేయాలనే Dr. P Srinivas Kumar ఆలోచన , దేశంలోని ప్రతి మూలకు ఈ నైపుణ్యాన్ని తీసుకురావాలనే అతని vision మాకు నచ్చి ఈ ఈవెంట్ను స్పాన్సర్ చేయాలని నిర్ణయించుకున్నాము , అతని భవిష్యత్ ప్రయత్నాలన్నిటికీ మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము అని తెలిపారు.
ViralPe సహ వ్యవస్థాపకురాలు శ్రీవల్లి మాట్లాడుతూ.. జ్ఞాపకశక్తి శిక్షణ ప్రాముఖ్యతను వివరించారు. “మేము పాన్-ఇండియా భాగస్వాముల ద్వారా దేశవ్యాప్తంగా 800 మెమరీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము” అని ఆమె చెప్పారు. నటుడు , జాతీయ శిక్షకుడు ప్రదీప్ మాట్లాడుతూ.. “జ్ఞాపకశక్తిని పెంపొందించడం ప్రతిఒక్కరలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది” అని వ్యాఖ్యానించారు. JNTUHలోని బయోటెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎ. ఉమ మాట్లాడుతూ.. “ఈ ఛాంపియన్షిప్లో అన్ని వయసుల వారు పోటీపడడం విశేషం” అని చెప్పారు. ఇతర ప్రముఖులు, జ్ఞాపకశక్తి అనేది దేవుడిచ్చిన వరం అని, రోజువారీ జీవితంలో జ్ఞాపకశక్తి నైపుణ్యాలు అమూల్యమైనవని చెప్పారు. Cronus Pharma అధ్యక్షుడు శ్రీకాంత్, “ఎవరైనా ఛాంపియన్గా మారడానికి నిరంతర కృషి అవసరం” అని వ్యాఖ్యానించారు. స్క్వాడ్రన్ లీడర్ జయసింహ, రాబోయే తరానికి బాధ్యతలు అందించడం ముఖ్యమని తెలిపారు.
Also Read
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
- RBI: ఆర్బీఐ ఈ-మాండేట్ రూల్స్ మార్పు.. కీలక మార్పులు ఇవే
- Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
ఈసందర్భంగా స్క్వాడ్రన్ లీడర్ జయసింహ మాట్లాడుతూ రాబోయే తరానికి బాధ్యతలు అందించే ప్రాధాన్యతను తెలియజేస్తూ జయసింహ మైండ్ ఎడ్యుకేషన్, ఇండియన్ మెమోరీ స్పోర్ట్స్ కౌన్సిల్ బాధ్యతలను Dr. P Srinivas Kumar నిర్వహిస్తారని, తాను ఒక మెంటర్గా కొనసాగుతానని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాల, కళాశాల , విద్యార్థికి జ్ఞాపకశక్తి శిక్షణ , జ్ఞాపకశక్తి క్రీడలను తీసుకువెళ్ళడంలో డాక్టర్ పి. శ్రీనివాస్ కుమార్ సామర్థ్యంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే.. గత 15 సంవత్సరాలుగా భారతదేశంలో జ్ఞాపకశక్తి క్రీడలను ప్రోత్సహించడంలో , నిలబెట్టడంలో స్క్వాడ్రన్ లీడర్ జయసింహ చేసిన అవిశ్రాంత ప్రయత్నాలకు గుర్తింపుగా, అన్ని జాతీయ జ్ఞాపకశక్తి అవార్డులకు “Squadron Leader Jayasimha Memory Awards” అనే పేరును జాతీయ అవార్డులకు పెట్టాలని డాక్టర్ పి శ్రీనివాస్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియగా, భారతదేశంలోని జ్ఞాపకశక్తి క్రీడలకు మద్దతు ఇవ్వడానికి విరాళాలు అందించాలని ఆయన స్పాన్సర్లను కోరారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?