హైదరాబాద్లో ఘనంగా 15వ ఇండియన్ మెమరీ ఛాంపియన్షిప్
- స్క్వాడ్రన్ లీడర్ జయసింహ నేతృత్వంలోని ఘనంగా ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్
- వైరల్పే ద్వారా స్పాన్సర్ చేయబడిన 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్
- పాల్గొన్న 3 దేశాలు.. 13 రాష్ట్రాలు.. 59 నగరాలు.. 74 పాఠశాలల నుండి 180 మంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్క్వాడ్రన్ లీడర్ జయసింహ నేతృత్వంలోని ఘనంగా ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్, వైరల్పే ద్వారా స్పాన్సర్ చేయబడిన 15వ ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ను అక్టోబర్ 20, 2024న హైదరాబాద్లో విజయవంతంగా నిర్వహించింది. ఈ ఛాంపియన్షిప్లో 3 దేశాలు, 13 రాష్ట్రాలు, 59 నగరాలు , 74 పాఠశాలల నుండి 180 మంది పాల్గొన్నారు. అందులో 60 సంవత్సరాల పైబడిన 10 మందికి పైగా మంది పాల్గొన్నారు. హైదర్నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , ASWA ఫౌండేషన్ నుండి ముఖ్యంగా 10 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈవెంట్ స్పాన్సర్గా ముందుకు వచ్చిన ViralPe చైర్మన్ Mr. P R మాట్లాడుతూ బిజినెస్కి చాలా కష్టమైన సేల్స్ని సులభతరం చెయ్యడానికి ఎలాగైతే ViralPe Sales and Services ని తీసుకురాబోతున్నామో, అలాగే చదివింది చాలా సులభతరంగా గుర్తుండడానికి ఈ మెమోరీ టెక్నిక్స్ చాలా సహాయపడతాయని, విద్యార్థులందరికీ ఈ టెక్నిక్స్ ని చేరవేయాలనే Dr. P Srinivas Kumar ఆలోచన , దేశంలోని ప్రతి మూలకు ఈ నైపుణ్యాన్ని తీసుకురావాలనే అతని vision మాకు నచ్చి ఈ ఈవెంట్ను స్పాన్సర్ చేయాలని నిర్ణయించుకున్నాము , అతని భవిష్యత్ ప్రయత్నాలన్నిటికీ మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము అని తెలిపారు.
ViralPe సహ వ్యవస్థాపకురాలు శ్రీవల్లి మాట్లాడుతూ.. జ్ఞాపకశక్తి శిక్షణ ప్రాముఖ్యతను వివరించారు. “మేము పాన్-ఇండియా భాగస్వాముల ద్వారా దేశవ్యాప్తంగా 800 మెమరీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము” అని ఆమె చెప్పారు. నటుడు , జాతీయ శిక్షకుడు ప్రదీప్ మాట్లాడుతూ.. “జ్ఞాపకశక్తిని పెంపొందించడం ప్రతిఒక్కరలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది” అని వ్యాఖ్యానించారు. JNTUHలోని బయోటెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎ. ఉమ మాట్లాడుతూ.. “ఈ ఛాంపియన్షిప్లో అన్ని వయసుల వారు పోటీపడడం విశేషం” అని చెప్పారు. ఇతర ప్రముఖులు, జ్ఞాపకశక్తి అనేది దేవుడిచ్చిన వరం అని, రోజువారీ జీవితంలో జ్ఞాపకశక్తి నైపుణ్యాలు అమూల్యమైనవని చెప్పారు. Cronus Pharma అధ్యక్షుడు శ్రీకాంత్, “ఎవరైనా ఛాంపియన్గా మారడానికి నిరంతర కృషి అవసరం” అని వ్యాఖ్యానించారు. స్క్వాడ్రన్ లీడర్ జయసింహ, రాబోయే తరానికి బాధ్యతలు అందించడం ముఖ్యమని తెలిపారు.
Also Read
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
ఈసందర్భంగా స్క్వాడ్రన్ లీడర్ జయసింహ మాట్లాడుతూ రాబోయే తరానికి బాధ్యతలు అందించే ప్రాధాన్యతను తెలియజేస్తూ జయసింహ మైండ్ ఎడ్యుకేషన్, ఇండియన్ మెమోరీ స్పోర్ట్స్ కౌన్సిల్ బాధ్యతలను Dr. P Srinivas Kumar నిర్వహిస్తారని, తాను ఒక మెంటర్గా కొనసాగుతానని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాల, కళాశాల , విద్యార్థికి జ్ఞాపకశక్తి శిక్షణ , జ్ఞాపకశక్తి క్రీడలను తీసుకువెళ్ళడంలో డాక్టర్ పి. శ్రీనివాస్ కుమార్ సామర్థ్యంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే.. గత 15 సంవత్సరాలుగా భారతదేశంలో జ్ఞాపకశక్తి క్రీడలను ప్రోత్సహించడంలో , నిలబెట్టడంలో స్క్వాడ్రన్ లీడర్ జయసింహ చేసిన అవిశ్రాంత ప్రయత్నాలకు గుర్తింపుగా, అన్ని జాతీయ జ్ఞాపకశక్తి అవార్డులకు “Squadron Leader Jayasimha Memory Awards” అనే పేరును జాతీయ అవార్డులకు పెట్టాలని డాక్టర్ పి శ్రీనివాస్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియగా, భారతదేశంలోని జ్ఞాపకశక్తి క్రీడలకు మద్దతు ఇవ్వడానికి విరాళాలు అందించాలని ఆయన స్పాన్సర్లను కోరారు.
తాజావార్తలు
-
South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
-
Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
-
Vaibhav-BCCI: వైభవ్కు అవకాశం ఇవ్వాల్సింది కాదు.. బీసీసీఐ తప్పు చేసింది.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్బస్టర్ గ్యారెంటీ
-
Nag Ashwin: నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు… ‘కల్కి’పై విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?