Kartika Purnima: కార్తీక పౌర్ణమినాడు ఉసిరి దీపం ఎందుకు..? విశిష్టత ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kartika Purnima: కార్తీక మాసం… శివపార్వతుల అనుగ్రహాన్ని అందించి.. ఆధ్యాత్మిక శక్తితో నింపే ఓ పవిత్రమైన నెల. ఈ మాసంలో దీపారాధన, నదీ స్నానాలు, ఉపవాసాలు వంటి ఎన్నో ఆచారాలు ఉన్నప్పటికీ.. వీటన్నింటిలోనూ ఉసిరి వృక్షం, దాని ఫలం యొక్క పాత్ర అసాధారణమైనది. కేవలం పూజలకే కాదు.. మన ఆరోగ్యం, పర్యావరణానికి కూడా మేలు చేసే ఈ ఉసిరి ప్రాముఖ్యత కార్తీకంలో ఎందుకంత విశేషంగా ఉందో తెలుసుకుందాం.
Also Read
- Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
- Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
- Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
పురాణాల ప్రకారం, కార్తీక మాసంలో ఉసిరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. స్కంద పురాణం ప్రకారం సాక్షాత్తు ఉసిరి చెట్టులో శివపార్వతులతో పాటు బ్రహ్మ, సకల దేవతలు నివసిస్తారు. అందుకే కార్తీక పౌర్ణమి, సోమవారాలు, ఏకాదశి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ పవిత్రమైన రోజుల్లో శివాలయాల్లో వెలిగించే 365 వత్తుల దీపారాధనతో పాటు ఉసిరి దీపం కూడా ప్రధానమైనదిగా భావిస్తారు.
ఉసిరి దీపారాధన వెనుక ఒక పురాణ కథ ఉంది. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు.. కార్తీక మాసంలో శివుడిని పూజించడానికి ఆలయం లేక ద్రౌపది బాధపడింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఉపదేశిస్తూ.. జూదంలో ఓడిపోయి కష్టాలు పడుతున్న పాండవులకు, గ్రహాల చెడు ఫలితాల నుంచి ఉపశమనం లభించడానికి కార్తీక మాసంలో ఉసిరి కాయ, ఆవు నెయ్యితో దీపం వెలిగించాలని సూచించాడు. పద్మపురాణం ప్రకారం ఈ దీపారాధన నవగ్రహ దోషాలను పరిహరిస్తుంది.
ఇక కార్తీక మాసం అనగానే గుర్తుకొచ్చే మరో ముఖ్యమైన ఆచారం వనభోజనాలు. పురాణాలలో నైమిశారణ్యంలో మునులు, శ్రీకృష్ణుడు నందగోప బాలురతో కలిసి వనభోజనం చేసినట్లు వివరించబడింది. అర్చకుల ప్రకారం ఈ మాసంలో ముఖ్యంగా ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం అత్యంత విశేష ఫలితాలను అందిస్తాయని తెలిపారు. హిందూ పురాణాలలో ఉసిరి చెట్టును ‘దాత్రి’ అని పిలుస్తారు, అంటే క్షమించే గుణానికి ప్రతీక. దీనిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. ఈ మాసంలో వనంలో ఉసిరి చెట్టు కింద ధాత్రి కళ్యాణం (ఉసిరి కొమ్మను విష్ణువుగా, తులసి కొమ్మను లక్ష్మీదేవిగా భావించి చేసే కళ్యాణం) జరిపించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి.
తాజావార్తలు
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!