Karthika Somavaaram: కార్తీక చివరి సోమవారం.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..
- కార్తీకమాస చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలకు పోటెత్తారు భక్తులు..
- తెల్లవారుజాము నుంచి మహాదేవుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు..
- పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు..
- శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు..
- శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthika Somavaaram: ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ శివనామంతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తులు గోదావరి, కృష్ణా నదుల్లో పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వదిలారు. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలతో పాటు ప్రముఖ ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి తదితర ఆలయాల్లో కార్తీక సోమవారం రద్దీ కొనసాగుతోంది. భక్తులు నదిలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.
Read also: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో పాముల కలకలం..
Also Read
- Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
- Thursday Astrology Predictions: గురువారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల్లో లాభాలే లాభాలు!
- ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి సమస్యలు, ఆటంకాలు తప్పవు1
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శివాలయం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. పాతాళగంగలో భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక స్నానాలు చేస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు స్వామివారి స్పర్శ దర్శనాన్ని రద్దు చేశారు. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తున్నారు. ద్రాక్షారామం, కుమారారామం, క్షీరారామం, భీమారామం, అమరారామం వంటి పంచారామ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. త్రిపురాంతకం, భైరవకోన, శ్రీకాళహస్తి, కపిలతీర్థం తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివ నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
తాజావార్తలు
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!