Karthika Somavaaram: కార్తీక చివరి సోమవారం.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..
- కార్తీకమాస చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలకు పోటెత్తారు భక్తులు..
- తెల్లవారుజాము నుంచి మహాదేవుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు..
- పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు..
- శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు..
- శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthika Somavaaram: ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ శివనామంతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తులు గోదావరి, కృష్ణా నదుల్లో పుణ్యస్నానాలు చేసి కార్తీక దీపాలు వదిలారు. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలతో పాటు ప్రముఖ ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి తదితర ఆలయాల్లో కార్తీక సోమవారం రద్దీ కొనసాగుతోంది. భక్తులు నదిలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు.
Read also: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో పాముల కలకలం..
Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. అప్పులు అస్సలు ఇవ్వొద్దు, తీసుకోవద్దు సుమీ!
- Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. కలిసి రానున్న ఆర్థిక లావాదేవీలు!
- Today Astrology: సోమవారం దిన ఫలాలు.. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్త సుమీ!
- IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శివాలయం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. పాతాళగంగలో భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక స్నానాలు చేస్తున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు స్వామివారి స్పర్శ దర్శనాన్ని రద్దు చేశారు. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తున్నారు. ద్రాక్షారామం, కుమారారామం, క్షీరారామం, భీమారామం, అమరారామం వంటి పంచారామ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. త్రిపురాంతకం, భైరవకోన, శ్రీకాళహస్తి, కపిలతీర్థం తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివ నామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి.
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
తాజావార్తలు
-
Monkey Control Tips: కోతులు ఇబ్బంది పెడుతున్నాయా..? శాశ్వతంగా తరిమికొట్టే అద్భుతమైన చిట్కాలు
-
Sergio Gor: భారత్తో అమెరికా సంబంధాలపై సెర్గియా గోర్ కీలక వ్యాఖ్యలు
-
Trisha: త్రిషకు మెగా కోడలు సర్ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉపాసన స్పెషల్ గిఫ్ట్!
-
Pakistan: జపాన్లో మసీదు వివాదం.. పాకిస్తాన్ పరువు పోయిందిగా..
-
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
ట్రెండింగ్
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!