Tesla India: ఎలోన్ మస్క్ భారీ ప్లాన్..! భారత్ బాధ్యతలు కీలక వ్యక్తికి అప్పగింత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla India: టెస్లా ఈ ఏడాది జూలైలో ముంబైలో తన మొదటి షోరూమ్ను ప్రారంభించి అధికారికంగా భారత్లోకి ప్రవేశించింది. తాజాగా ఎలోన్ మస్క్ కంపెనీ భారత మార్కెట్లో తన పట్టును బలోపేతం చేసుకోవడానికి భారీ ప్లాన్ వేసింది. గతంలో లంబోర్గిని ఇండియాకు నాయకత్వం వహించిన శరద్ అగర్వాల్ను భారత్కి కొత్త దేశ అధిపతిగా కంపెనీ నియమించింది. ఈ నిర్ణయం టెస్లా వ్యూహంలో ఒక మలుపు కావచ్చని నిపుణులు అంటున్నారు. కస్టమర్ల నాడిని పట్టుకోవడానికి కంపెనీ
ప్రయత్నిస్తోంది.
READ MORE: Jatadhara : ‘జటాధర’లో ధన పిశాచి సీక్వెన్స్ పై ప్రేరణ అరోరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Also Read
- 7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
- TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
- Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. భారత్లో టెస్లా కార్యకలాపాలకు శరద్ అగర్వాల్ నాయకత్వం వహిస్తారు. శరద్ అగర్వాల్ నియామకం కంపెనీ దేశంలో తన ఉనికిని విస్తరిస్తుందనే ఆశలను రేకెత్తించింది. శరద్ అగర్వాల్ భారత ఆటో పరిశ్రమలోని లగ్జరీ బ్రాండ్లతో అనుబంధం కలిగి ఉన్నారు. జావా, యెజ్డి, బీఎస్ఎ వంటి మోటార్ సైకిళ్ల తయారీదారు క్లాసిక్ లెజెండ్స్లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పదవికి ఆయన ఇటీవల రాజీనామా చేశారు. గతంలో ఆయన భారతదేశంలో లగ్జరీ స్పోర్ట్స్ కార్ కంపెనీ లంబోర్గినికి నాయకత్వం వహించారు. ఆయన నాయకత్వం వహించినప్పుడు కంపెనీ రికార్డు అమ్మకాలను సాధించింది. బ్రాండ్ ప్రీమియం ఇమేజ్ సైతం బలోపేతం చేశారు. ఇప్పుడు టెస్లా అమ్మకాల నెట్వర్క్ను బలోపేతం చేయడం ఆయన మొదటి లక్ష్యంగా పెట్టుకున్నారు.
READ MORE: Temple Dwajasthambam: ఆలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా..? ప్రాముఖ్యత ఏంటంటే..!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన టెస్లా కార్ల అమ్మకాలను భారతదేశంలో ప్రారంభించారు. అయితే, అనుకున్నంగా ఈ కార్లకు భారతీయుల నుంచి స్పందన రావడం లేదు. జూలై 15న అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి సెప్టెంబర్ వరకు తన మోడల్ Y కోసం 600 వరకు ఆర్డర్లు వచ్చినట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఇది కంపెనీ నిర్దేశించుకున్న అంతర్గత లక్ష్యాల కన్నా చాలా తక్కువగా ఉంది. టెస్లా తన వార్షిక కోటాలో 2500 వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుందని నివేదిక తెలిపింది. టెస్లా ప్రస్తుతం 2025లో భారతదేశానికి 350 నుంచి 500 కార్లను రవాణా చేయాలని చూస్తోంది. మొదటి బ్యాచ్ సెప్టెంబర్ ప్రారంభంలో చైనా షాంఘై ప్లాంట్ నుంచి వస్తుంది. ప్రారంభ డెలవరీలు ముంబై, ఢిల్లీ, పూణే, గురుగ్రామ్లకు పరిమితం చేయబడుతాయి.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!