Tesla India: ఎలోన్ మస్క్ భారీ ప్లాన్..! భారత్ బాధ్యతలు కీలక వ్యక్తికి అప్పగింత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla India: టెస్లా ఈ ఏడాది జూలైలో ముంబైలో తన మొదటి షోరూమ్ను ప్రారంభించి అధికారికంగా భారత్లోకి ప్రవేశించింది. తాజాగా ఎలోన్ మస్క్ కంపెనీ భారత మార్కెట్లో తన పట్టును బలోపేతం చేసుకోవడానికి భారీ ప్లాన్ వేసింది. గతంలో లంబోర్గిని ఇండియాకు నాయకత్వం వహించిన శరద్ అగర్వాల్ను భారత్కి కొత్త దేశ అధిపతిగా కంపెనీ నియమించింది. ఈ నిర్ణయం టెస్లా వ్యూహంలో ఒక మలుపు కావచ్చని నిపుణులు అంటున్నారు. కస్టమర్ల నాడిని పట్టుకోవడానికి కంపెనీ
ప్రయత్నిస్తోంది.
READ MORE: Jatadhara : ‘జటాధర’లో ధన పిశాచి సీక్వెన్స్ పై ప్రేరణ అరోరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Also Read
- India Tractor Sales: ఒక్క నెలలో 83,000 ట్రాక్టర్లు సేల్.. ఈ బ్రాండ్ కే జై కొట్టిన రైతులు
- Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
- Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. భారత్లో టెస్లా కార్యకలాపాలకు శరద్ అగర్వాల్ నాయకత్వం వహిస్తారు. శరద్ అగర్వాల్ నియామకం కంపెనీ దేశంలో తన ఉనికిని విస్తరిస్తుందనే ఆశలను రేకెత్తించింది. శరద్ అగర్వాల్ భారత ఆటో పరిశ్రమలోని లగ్జరీ బ్రాండ్లతో అనుబంధం కలిగి ఉన్నారు. జావా, యెజ్డి, బీఎస్ఎ వంటి మోటార్ సైకిళ్ల తయారీదారు క్లాసిక్ లెజెండ్స్లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పదవికి ఆయన ఇటీవల రాజీనామా చేశారు. గతంలో ఆయన భారతదేశంలో లగ్జరీ స్పోర్ట్స్ కార్ కంపెనీ లంబోర్గినికి నాయకత్వం వహించారు. ఆయన నాయకత్వం వహించినప్పుడు కంపెనీ రికార్డు అమ్మకాలను సాధించింది. బ్రాండ్ ప్రీమియం ఇమేజ్ సైతం బలోపేతం చేశారు. ఇప్పుడు టెస్లా అమ్మకాల నెట్వర్క్ను బలోపేతం చేయడం ఆయన మొదటి లక్ష్యంగా పెట్టుకున్నారు.
READ MORE: Temple Dwajasthambam: ఆలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా..? ప్రాముఖ్యత ఏంటంటే..!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన టెస్లా కార్ల అమ్మకాలను భారతదేశంలో ప్రారంభించారు. అయితే, అనుకున్నంగా ఈ కార్లకు భారతీయుల నుంచి స్పందన రావడం లేదు. జూలై 15న అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి సెప్టెంబర్ వరకు తన మోడల్ Y కోసం 600 వరకు ఆర్డర్లు వచ్చినట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఇది కంపెనీ నిర్దేశించుకున్న అంతర్గత లక్ష్యాల కన్నా చాలా తక్కువగా ఉంది. టెస్లా తన వార్షిక కోటాలో 2500 వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుందని నివేదిక తెలిపింది. టెస్లా ప్రస్తుతం 2025లో భారతదేశానికి 350 నుంచి 500 కార్లను రవాణా చేయాలని చూస్తోంది. మొదటి బ్యాచ్ సెప్టెంబర్ ప్రారంభంలో చైనా షాంఘై ప్లాంట్ నుంచి వస్తుంది. ప్రారంభ డెలవరీలు ముంబై, ఢిల్లీ, పూణే, గురుగ్రామ్లకు పరిమితం చేయబడుతాయి.
తాజావార్తలు
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!