Deputy Cm Amzad Basha: ప్యాకేజీ నాయకుడు పవన్ కళ్యాణ్
ఏపీలో అటు వైసీపీ ఇటు జనసేన నేతల విమర్శలు హీటెక్కిస్తున్నాయి. కడప పర్యటనలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై మండిపడ్డారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఘాటైన విమర్శలకు దిగారు. చంద్రబాబు దత్త పుత్రుడు రైతులకు మేలు చేయడానికి రాలేదు..కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చారు. కడప జిల్లాలో కులాలు లేవు, మతాలు లేవు అందరూ ఒకటే ఆన్న విధంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోంది.
Read Also: Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కోసం దెబ్బలు తినడానికైనా రెడీ
Also Read
- Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..
- Tesla Model Y L: టెస్లా మోడల్ Y కొత్త L వేరియంట్ విడుదల.. 661KM రేంజ్.. ధర ఎంతంటే?
- 2026 Kia Syros: కొత్త వేరియంట్లు & ఆటో ఆప్షన్లతో 2026 కియా సైరోస్ లాంచ్.. పూర్తి వివరాలు
- Hyundai Venue Knight Edition: హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలివే
ప్రశ్నించడానికి వచ్చిన పవణ్ కళ్యాణ్ గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో రైతులు అత్మ హత్యలు చేసుకున్నా, నీళ్ళు లేకపోయినా ఎందుకు ఆ రోజు ప్రశ్నించ లేదు. ప్యాకేజీ నాయకుడు పవన్ కళ్యాణ్ అని దుయ్యబట్టారు అంజాద్ బాషా. ప్యాకేజీ కుదిరాక ఏదో పర్యటన చేసి విమర్శిస్తున్నారు..గత టిడిపి ప్రభుత్వంలో 45 వేల బెల్టు షాపులు పెట్టీ, మద్యం ఏరులై పారి నప్పుడు.. మాట్లాడకుండా ఉన్న పవన్ ఎందుకు అప్పుడు మాట్లాడలేదు..వైసిపి ప్రభుత్వం బెల్టు షాపులు రద్దు చేసింది. ఇది తెలియక మాట్లాడుతున్నారు
కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైసిపి.. కరుడు గట్టిన టిడిపి కార్య కర్తలకు కూడా మంచి చేస్తున్నారు..నువ్వు, చంద్రబాబు కలిసి వైసిపికి కులం, మతం అంట గడుతున్నారు..షర్మిల ఎప్పుడైనా జగన్ అన్యాయం చేసారని చెప్పారా? అని ఆయన ప్రశ్నించారు. నీ భార్య మీపై బహిరంగంగా విమర్శలు చేసిన విషయం మర్చిపోవద్దు. కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఈ జిల్లా ప్రజలు తరిమి తరిమికొడతారు.. ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఒక కులానికి, వర్గానికి కొమ్ము కాస్తు న్నావు…నీకు ఒక హిడెన్ అజెండా ఉంది..కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తూ న్యాయం చేసిన ప్రభుత్వం వైసీపీ.. కౌలు రైతులకు కార్డు ఉండి, ప్రభుత్వ సాయం అందక పోయినట్లు నిరూపిస్తే నువ్వు ఏం చెబితే అది చేస్తాం అని సవాల్ విసురుతున్నా అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా.
Read Also: Himachal Pradesh Flash Floods: మెరుపు వరదలు.. ఇప్పటి వరకు 19 మంది మృతి
తాజావార్తలు
-
Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!
-
Supreme Court: ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది.. జస్టిస్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
PEDDI : ‘పెద్ది’ జూన్ నెలాఖరున రిలీజ్ ఫిక్స్..
-
Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!
ట్రెండింగ్
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!