Himachal Pradesh Flash Floods: మెరుపు వరదలు.. ఇప్పటి వరకు 19 మంది మృతి
Himachal Pradesh Flash Floods: హిమాచల్ ప్రదేశ్ మెరుపు వరదులు, వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కుంభవృష్టిగా వానలు కురవడంతో మెరుపు వరదుల, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ పరిస్థితి ఏర్పడింది. మెరుపు వరదలు, వర్షాలు, కొండచరియలు విరిగి పడటం మూలంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 19 మంది మరణించగా.. 9 మంది గాయపడ్డారు. మరో ఐదుగురు గల్లంతయ్యారని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది.
గోహర్ డెవలప్మెంట్ బ్లాక్లోని కషన్ గ్రామంలో కొండచరియల వల్ల ఇళ్లు కూలిపోవడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మండి, కాంగ్రా, చంబా జిల్లాల్లో అత్యధిక నష్టం నమోదు అయింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 36 వరదలు, ప్రమాదాల వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మండి వద్ద మనాలి-చండీగఢ్ జాతీయ రహదారి, సిమ్లా – చండీగఢ్ హైపే కొండచరియలు విరిగిపడటంతో బ్లాక్ చేశారు. ఒక్క మండి జిల్లాలోనే మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల 13 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. షోఘి, తారా దేవి మధ్య సోను బంగ్లా వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. పఠాన్ కోట్- హిమాచల్ ప్రదేశ్ ను కలిపే చక్కి రైల్వే బ్రిడ్జ్ వరదల ధాటికి కూలిపోయింది.
Also Read
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- Affair Doubt: ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య వీడియో కాల్లో ఉండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త.. అది చూసి..
- Operation Sindoor: భారత్ దెబ్బకు వణికిపోయిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ అజ్ఞాతంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్!
Read Also: Airport Name Change: పంజాబ్, హర్యానా ప్రభుత్వాల కీలక నిర్ణయం.. ఎయిర్ పోర్టు పేరు మార్పు
హిమాచల్ ప్రదేశ్ చంబా, బిలాస్ పూర్, సిర్మౌర్, మండి, కాంగ్రా జిల్లాల్లోని ఐసోలేటెడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచానా వేసింది. టూరిస్టులు, ప్రజలు నదులు, వరద ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ నెల 25 వరకు కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని.. డిస్టాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రజలను హెచ్చరించింది.
తాజావార్తలు
-
KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Condom Prices: బెడ్రూమ్లో అమెరికా – ఇరాన్ ‘వార్’ సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
-
IPL 2026: ఓటమి లేకుండా దూసుకెళ్తున్న పంజాబ్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బ్యాట్స్మెన్ దూరం..
-
Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..
-
LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?