Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కోసం దెబ్బలు తినడానికైనా రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం స్వంత జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందడి చేశారు. కడప జిల్లాలో రైతు భరోసా యాత్రకు విచ్చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. మాకు ఎదురు తిరిగితే చేతులు కట్టుకొక పోతే క్రింద కూర్చో బెడతామంటే సహించం అన్నారు పవన్. ఈ ముఖ్య మంత్రికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? ఇది ఆత్మ గౌరవానికి సంబంధించింది. ఆస్తులు పోయినా లెక్క చేయను..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సిఎం జగన్ ను సొంత కొడుకులా చూసుకుంటారని చెప్పారు.
రాజకీయాల్లోకి సరదాకోసం రాలేదు.. మార్పు కోసం వచ్చానని స్పష్టం చేశారు పవన్. ఏ ఒక్కరినీ వర్గ శత్రువుగా పరిగణించం అన్నారు పవన్ కళ్యాణ్. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రాయలసీమను అభివృద్ధి చేస్తాం అన్నారు పవన్. మాటలు చెప్పే మనిషిని కాదు. పద్యం పుట్టిన పుణ్యభూమిలో మద్యం ప్రవహిస్తోందని ఆవేదన చెందారు. కౌలు రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు కడప జిల్లాలో 190 మంది కౌలు రైతులు చనిపోయారని గుర్తు చేశారు. బాధిత కౌలు రైతులను తమవంతుగా ఆదుకుంటామన్నారు.
Also Read
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
మరి రాష్ట్రం లోని పెండింగ్ పనులు ఎందుకు చేయలేకపోతున్నారు. రాష్ట్రం కోసం పని చేయడం లేదు.. కేసుల కోసం భయపడుతున్నారు. ఏపీకి బంగారు భవిషత్ కోసం దెబ్బలు తినడానికి నేను సిద్దంగా ఉన్నా అన్నారు పవన్. జన సేన పార్టీ వైపు ఒక సారి చూడండి.. ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమకు ఏం చేయాలో చేస్తా..మార్పు కోసం జనసేన ఉంది.. ప్రాధాన్యం లేని కులాలకు ప్రాధాన్యం వచ్చేలా చూస్తా అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో వారసత్వ రాజకీయాల్లో మార్పు రావాలి..
కులం, మతాలపై రాజకీయాలు సరికాదు.. నా కుటుంబంలోని వ్యక్తిని కూడా జగన్ చేతులు పట్టుకునేలా చేశారు.. చేతులు కట్టుకుని తనముందు నిలబడేలా చేశారు.. నేనెప్పుడూ కులమతాల గురించి ఆలోచించను అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో తన అన్న ప్రజారాజ్యం పార్టీ విలీనంపై పవన్ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వైసీపీలో వున్న నేతలే అన్నయ్య పార్టీని విలీనం చేయించారని..ఆ పార్టీ ఇప్పుడు ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు పవన్ కళ్యాణ్. కేంద్రం మెడలు వంచుతానని, వైసీపీ ఎంపీలే ఢిల్లీలో మెడలు వంచుతున్నారన్నారు.
Read Also: Kerala Savari: కేరళ ప్రభుత్వ వినూత్న నిర్ణయం.. సొంతగా క్యాబ్ సర్వీస్ ప్రారంభం
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!