Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కోసం దెబ్బలు తినడానికైనా రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం స్వంత జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సందడి చేశారు. కడప జిల్లాలో రైతు భరోసా యాత్రకు విచ్చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. మాకు ఎదురు తిరిగితే చేతులు కట్టుకొక పోతే క్రింద కూర్చో బెడతామంటే సహించం అన్నారు పవన్. ఈ ముఖ్య మంత్రికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? ఇది ఆత్మ గౌరవానికి సంబంధించింది. ఆస్తులు పోయినా లెక్క చేయను..కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సిఎం జగన్ ను సొంత కొడుకులా చూసుకుంటారని చెప్పారు.
రాజకీయాల్లోకి సరదాకోసం రాలేదు.. మార్పు కోసం వచ్చానని స్పష్టం చేశారు పవన్. ఏ ఒక్కరినీ వర్గ శత్రువుగా పరిగణించం అన్నారు పవన్ కళ్యాణ్. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రాయలసీమను అభివృద్ధి చేస్తాం అన్నారు పవన్. మాటలు చెప్పే మనిషిని కాదు. పద్యం పుట్టిన పుణ్యభూమిలో మద్యం ప్రవహిస్తోందని ఆవేదన చెందారు. కౌలు రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు కడప జిల్లాలో 190 మంది కౌలు రైతులు చనిపోయారని గుర్తు చేశారు. బాధిత కౌలు రైతులను తమవంతుగా ఆదుకుంటామన్నారు.
Also Read
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
మరి రాష్ట్రం లోని పెండింగ్ పనులు ఎందుకు చేయలేకపోతున్నారు. రాష్ట్రం కోసం పని చేయడం లేదు.. కేసుల కోసం భయపడుతున్నారు. ఏపీకి బంగారు భవిషత్ కోసం దెబ్బలు తినడానికి నేను సిద్దంగా ఉన్నా అన్నారు పవన్. జన సేన పార్టీ వైపు ఒక సారి చూడండి.. ప్రజలకు, ముఖ్యంగా రాయలసీమకు ఏం చేయాలో చేస్తా..మార్పు కోసం జనసేన ఉంది.. ప్రాధాన్యం లేని కులాలకు ప్రాధాన్యం వచ్చేలా చూస్తా అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో వారసత్వ రాజకీయాల్లో మార్పు రావాలి..
కులం, మతాలపై రాజకీయాలు సరికాదు.. నా కుటుంబంలోని వ్యక్తిని కూడా జగన్ చేతులు పట్టుకునేలా చేశారు.. చేతులు కట్టుకుని తనముందు నిలబడేలా చేశారు.. నేనెప్పుడూ కులమతాల గురించి ఆలోచించను అన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో తన అన్న ప్రజారాజ్యం పార్టీ విలీనంపై పవన్ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వైసీపీలో వున్న నేతలే అన్నయ్య పార్టీని విలీనం చేయించారని..ఆ పార్టీ ఇప్పుడు ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు పవన్ కళ్యాణ్. కేంద్రం మెడలు వంచుతానని, వైసీపీ ఎంపీలే ఢిల్లీలో మెడలు వంచుతున్నారన్నారు.
Read Also: Kerala Savari: కేరళ ప్రభుత్వ వినూత్న నిర్ణయం.. సొంతగా క్యాబ్ సర్వీస్ ప్రారంభం
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
-
Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
-
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!