-
PNB SO Recruitment 2025: బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా?.. ఈ జాబ్స్ మీకోమే.. నెలకు రూ. లక్ష జీతం
బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా? ఐటీ జాబ్స్ కు బదులు ఇతర ఉద్యోగాల కోసం ట్రై చేస్తు్న్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 350 పోస్టులను భర్తీచేయనున్నది. భర్తీకానున్న పోస్టుల్లో ఆఫీసర్ క్రెడిట్ 250, ఆఫీసర్ ఇండస్ట్రీ 75, మేనేజర్ ఐటీ 5, మేనేజర్ డేటా సైంటిస్ట్ 3, సీనియర్ మేనేజర్ […] -
UAE: యూఏఈలో మరణశిక్ష పడిన యూపీ మహిళకు ఉరిశిక్ష అమలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో భారత మహిళకు ఉరిశిక్ష అమలైంది. చిన్నారి మృతి కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ మహిళ షహజాది ఖాన్ను ఉరితీసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాకు చెందిన ముప్పై మూడేళ్ల మహిళ నాలుగు నెలల చిన్నారిని చంపిన ఆరోపణపై అబుదాబిలో మరణ శిక్షను ఎదుర్కొన్నది. యుఎఇ చట్టాలు, నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 15, 2025న షహజాదీ ఖాన్ను ఉరితీశారని విదేశాంగ మంత్రి కోర్టుకు తెలిపారు. […] -
Odisha: అనారోగ్యానికి గురైన నెల రోజుల శిశువు.. నయం కావడానికి ఒంటిపై 40 వాతలు..
ఏఐతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్న వేళ కొంతమంది ప్రజలు మూఢనమ్మకాలనే విశ్వసిస్తున్నారు. అనారోగ్యానికి గురైనా, ఆపదలు వచ్చినా ఎవరో తమకు బాణామతి చేశారని అందుకే ఇలా అయ్యిందని ఆందోళన చెందుతున్నారు. మూఢనమ్మకాలపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో అడ్డుకట్టపడడం లేదు. తాజాగా ఒడిషాలో దారుణ ఘటన వెలుగుచూసింది. నెల రోజుల వయసున్న శిశువు అనారోగ్యానికి గురికాగా.. జబ్బు నయం కావడానికి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి ఒంటిపై ఇనుపరాడ్డుతో వాతలు పెట్టారు. ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. […] -
IIT Baba: గంజాయితో దొరికిపోయిన ఐఐటీ బాబా అభయ్ సింగ్.
మహా కుంభమేళా ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన ఐఐటీ బాబా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. మళ్లీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ పై జోస్యం చెప్పాడేమో అని అనుకుంటే పొరపాటే. గంజాయితో దొరికిపోవడంతో ఐఐటీ బాబా మరోసారి సంచలనంగా మారాడు. గంజాయి కేసులో జైపూర్ పోలీసులు ఐఐటీ బాబా అభయ్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో వెల్లడించడంతో.. పోలీసులు అతని ఆచూకీ కనిపెట్టి జైపూర్లోని రిద్ధి-సిద్ధి ప్రాంతంలోని ఒక హోటల్ లో […] -
CM Revanth Reddy: కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో చర్చించామని అన్నారు. గోదావరి జలాలను మూసీ నదికి అనుసంధానించాలని మొన్ననే ప్రధానిని కోరాము. ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగం గురించే ప్రధానంగా చర్చించామని తెలిపారు. తెలంగాణలోని నికర జలాలపై సమ్మక సారక్క ప్రాజెక్టు, సీతారామ తదితర ప్రాజెక్టులు కడుతున్నాం. మా శాశ్వత కేటాయింపుల్లోని […] -
Supreme Court: అంధులు కూడా న్యాయమూర్తులు కావచ్చు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
దృష్టిలోపం ఉండి న్యాయ సేవలోకి రావాలనుకునే వారికి బిగ్ రిలీఫ్. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సోమవారం అంధుల కోసం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అంధులు కూడా న్యాయ సేవలలో నియమించబడే హక్కు కలిగి ఉంటారని సుప్రీంకోర్టు పేర్కొంది. అంధులు కూడా న్యాయమూర్తులు కావచ్చని కోర్టు పేర్కొంది. దృష్టి లోపం ఉన్న వ్యక్తులను న్యాయ సేవ నుంచి మినహాయించకూడదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సోమవారం కొట్టివేసింది. Also Read:Botsa Satyanarayana: రాజధాని అంశంపై బొత్స […] -
Botsa Satyanarayana: రాజధాని అంశంపై బొత్స సంచలన వ్యాఖ్యలు..
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజధానిపై చర్చనీయాంశంగా మారాయి. బొత్స మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితి, ప్రభుత్వ స్టాండ్ ప్రకారం 3 రాజధానులు అని అన్నామని బొత్స తెలిపారు. ఇప్పుడు రాజధానిపై తమ విధానం ఏంటనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు అంత ఖర్చుపెట్టే స్థోమత […] -
Best Mileage Cars: బెస్ట్ మైలేజ్ అందించే తోపు పెట్రోల్ కార్లు ఇవే.. ధర కూడా తక్కువే
పెట్రోల్ ధరలు వ్యక్తిగత ఆర్థిక స్థితిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరగడమే కానీ, తగ్గడమనేది లేకుండాపోయింది. చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రలో ధర రూ. 100కు పైగానే ఉంది. పెట్రోల్ కార్లు వాడే వారికి ఇది మరింత భారంగా మారింది. లాంగ్ జర్నీ చేసే వారు పెట్రోల్ కే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే చాలా మంది మంచి మైలేజీ ఇచ్చే పెట్రోల్ కార్ల కోసం చూస్తుంటారు. ఇలాంటి వారి కోసం పలు ఆటో […] -
IOB Recruitment 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 750 జాబ్స్.. మంచి జీతం.. మిస్ చేసుకోకండి
బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్. బ్యాంక్ జాబ్ సాధించాలనుకునే మీ కలను నెరవేర్చుకునే ఛాన్స్ వచ్చింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ఐఓబీ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 750 పోస్టులను భర్తీచేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 31 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు. డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నవారు ఈ ఛాన్స్ ను […] -
IND vs NZ: పంజా విసిరిన వరుణ్ చక్రవర్తి.. కివీస్ పై భారత్ ఘన విజయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్ లో భారత్ కివీస్ పై ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో న్యూజీలాండ్ ను చిత్తు చేసింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. బౌలర్ల్ ధాటికి కివీస్ ప్లేయర్స్ పెవిలియన్ కు క్యూ కట్టారు. కివీస్ 45.3 ఓవర్లలో 205 పరుగులు మాత్రమేచేసి ఆలౌట్ అయ్యింది. కాగా […]
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!