-
Gold Rates: గర్జిస్తున్న బంగారం ధరలు.. నేడు తులంపై ఎంత పెరిగిందంటే?
బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఓరోజు తగ్గుతూ మళ్లీ పెరుగుతూ కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. ఇవాళ మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. నేడు తులం గోల్డ్ పై రూ. 220 పెరిగింది. పసిడి ధరలు పెరగగా వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి. కిలో వెండిపై రూ. 1000 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,573, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,775 వద్ద ట్రేడ్ అవుతోంది. Also […] -
Ponnam Prabhakar: ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారు..
మినిస్టర్ క్వార్టర్స్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. ఆర్టీసీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా ఈరోజు, రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చు మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని తెలిపారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి నేను కానీ మా ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. […] -
Hyderabad: జూబ్లీహిల్స్ లో “బూమ్ బూమ్”.. విదేశీ యువతులతో దందా
డబ్బు సంపాదనే లక్ష్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా హైదరాబాద్ లో ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. జూబ్లీహిల్స్ లో బూమ్ బూమ్ పేరిట కస్టమర్లకు వల వేస్తు వ్యభిచారానికి పాల్పడుతున్నారు. థాయిలాండ్ యువతితో పాటు బంగ్లాదేశ్ యువతి చేత వ్యభిచారం చేయిస్తున్నారు. సర్వీస్ అపార్ట్ మెంట్ కేంద్రంగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు. థాయ్ లాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి దందా చేస్తున్నారు. నాయక్ అనే నిర్వాహకుడు ఈ దందాకు తెరలేపాడు. […] -
Aadi Srinivas: గల్ఫ్ లో మంచి ఆఫర్ ఉందంటూ.. ఎమ్మెల్యేకు మహిళ ఫోన్.. చివరకు
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఓ మహిళ కాల్ చేసిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. గల్ఫ్ లో మంచి ఆఫర్ ఉందంటూ ఎమ్మెల్యేకు ఓ కన్సల్టెన్సీ మహిళ ఫోన్ చేసింది. నువ్వు ఎవ్వరికి ఫోన్ చేశావో తెలుసా అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేతో మహిళ వాగ్వాదానికి దిగింది. మహిళ తీరుపై సదరు ఎమ్మెల్యే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లక్ష్మీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీపై సుమోటోగా కేసు నమోదు చేశారు […] -
Trump: విదేశీ సినిమాలపై ట్రంప్ సుంకాల మోత.. ఏకంగా 100 శాతం పన్ను
అధికారం చేపట్టిన నాటి నుంచి డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలతో సంచలనంగా మారాడు. సుంకాల మోతతో వాణిజ్య రంగంతో పాటు ఇతర రంగాలు కుదేలై పోయాయి. అక్రమ వలసలను అరికట్టేందుకు కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు సినిమా రంగంపై ట్రంప్ దృష్టిసారించారు. విదేశీ సినిమాలపై ట్రంప్ సుంకాల మోత మోగించారు. అమెరికన్ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య శాఖ, యుఎస్ వాణిజ్య ప్రతినిధి (యుఎస్టిఆర్) ను అమెరికా వెలుపల […] -
Nitin Gadkari: నేడు తెలంగాణకు నితిన్ గడ్కరీ..
కేంద్రమంత్రి నితిన్ గడ్కరి నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన 5,400 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 26 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలను నిర్వహించనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా కొమురం భీం జిల్లాకు వెళ్లనున్నారు. జాతీయరహదారి 363 ని జాతికి అంకితం చేయనున్నారు. కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంబోత్సవాలు,శంఖుస్థాపనలు చేయనున్నారు. కార్యక్రమాల్లో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండిసంజయ్, రాష్ట్రమంత్రులు కోమటి రెడ్డి వెంకట్ […] -
Kanpur: షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం.. 5 మందికి తీవ్ర గాయాలు
కాన్పూర్లోని చమన్ గంజ్ ప్రాంతంలో లెదర్ ఫ్యాక్టరీ ఉన్న ఆరు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు లోపల చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఐదు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అదే భవనంలో నివాసం ఉంటున్న దంపతులు, వారి ముగ్గురు కుమార్తెలు మూడవ-నాల్గవ అంతస్తులో చిక్కుకున్నారు. […] -
Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ముగ్గురు సైనికులు మృతి
జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. 700 అడుగుల లోతైన లోయలో ఆర్మీ కాన్వాయ్ లోని వాహనం పడింది. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సైనికులు మృతిచెందారు. మరణించిన సైనికులను అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్ గా గుర్తించినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. Also Read:Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. ‘గోట్’ […] -
Bandi Sanjay: ఆపరేషన్ కగార్ ఆగదు… మావోయిస్టులు ఆయుధాలు వీడాల్సిందే.. లొంగిపోవాల్సిందే
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆపరేషన్ కగార్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ కగార్ ఆగదు… మావోయిస్టులు ఆయుధాలు వీడాల్సిందే… లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. మావోలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదు.. నక్సల్స్ హింసలో ఎందరో లీడర్లు చనిపోయారు… పోలీసులు చనిపోయారు… అప్పుడు చర్చల గురించి.. మావోయిస్టులకు మద్దతుగా కేసీఆర్, రేవంత్ ఎందుకు మాట్లాడలేదు.. మావోయిస్టు పార్టీ నిషేధ సంస్థ వారితో చర్చలు ఉండవు. Also Read:Medak: పెళ్లయిన మూడు నెలలకే […] -
Medak: పెళ్లయిన మూడు నెలలకే ఘోరం.. అసలు ఏం జరిగిందంటే?
మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు పెళ్లయిన మూడు నెలలకే నూరేళ్లు నిండాయి. పెళ్లయిన మూడునెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. పూజ(24) నిన్న రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిన్నశంకరంపేట (మం) అగ్రహారంలో చోటుచేసుకుంది. తమ కూతురు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. భర్త మహేష్, అత్తమామలే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. Also […]
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..