విమాన ప్రయాణికుల కోసం బంపరాఫర్ తీసుకొచ్చింది ఇండిగో ఎయిర్లైన్స్.. వింటర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.. అయితే, ఇది పరిమిత కాలపు ఆఫర్.. మూడు రోజుల పాటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకు టికెట్లు అందించనున్నట్లు పేర్కొంది.. ఈ ఆఫర్లో దేశీయ విమానాలకు రూ. 2,023కు మరియు అంతర్జాతీయ విమానాలకు రూ. 4,999 నుండి విమాన ఛార్జీలు అందుబాటులో ఉంటాయి.. 55 శాతం మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థగా […]
Saturday Special Sri Hanuman Stotra Parayanam Live: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల సంపదలు చేకూరుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించేందుకు కింది వీడియో లింక్ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=JI95mVd8eKI
* హైదరాబాద్: నేడు మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు.. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు * కడప జిల్లాలో నేడు రెండో రోజు సీఎం జగన్ పర్యటన.. మధ్యాహ్నం వరకు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం.. వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సీఎం.. మధ్యాహ్నం పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న జగన్.. * పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరంలో […]
తెలంగాణలో అధికార బీఆర్ఎస్, విపక్ష బీజేపీ మధ్య.. మాటల యుద్ధంతో పాటు సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా చెప్పుతో కొట్టుకునే వ్యాఖ్యలు రచ్చ చేస్తున్నాయి.. ఇప్పుడు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి బహిరంగ సవాల్ విసిరారు.. మా ముఖ్యమంత్రి కేసీఆర్పైన ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.. ఈ రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు చూపించిన నేను రాజీనామా చేస్తాను […]
Police Recruitment: ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న వారికి శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పోలీస్ రిక్రూట్మెంట్ గరిష్ట వయస్సును రెండేళ్ల పాటు సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది ప్రభుత్వం.. వాటిలో 411 ఎస్ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా.. ఇప్పటికే ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.. ఎస్ఐ పోస్టుల్లో 315 సివిల్ (పురుషులు, మహిళల కేటగిరీలు), 96 ఏపీఎస్పీ (పురుషులు) […]
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చేందుకు.. పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘నాడు-నేడు’ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఇప్పటికే చాలా పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి.. మరికొన్ని స్కూళ్లలో పనులు జరుగుతున్నాయి.. కానీ, కర్నూలు జిల్లాలో పాఠశాల కంట్రాక్టర్ నిర్లక్ష్యంతో గోడ కూలి టీచర్, విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే, టీచర్ అప్రమత్తతతో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. జిల్లాలోని కౌతాళం మండలం హాల్వీ ఎలిమేంటరీ స్కూల్లో ఈ ఘటన […]
మనిషికి శ్వాస ఎంత అవసరమో.. భాష కూడా అంతే అవసరం అని నొక్కి చెప్పారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. విజయవాడలో జరుగుతోన్న 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు వెంకయ్యనాయుడు.. ఇక, ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, కొలకలూరి ఇనాక్, లావు అంజయ్య చౌదరి, పలువురు ప్రముఖ రచయితలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మనిషికి శ్వాస ఎంత అవసరమో భాష కూడా అంతే […]
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.. నెల్లూరు జిల్లా అభివృద్ధిపై అధికారులతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో అధికారులు.. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.. అయితే, ఈ సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు.. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మారుతున్నారు.. శాఖలు మారుతున్నాయి.. కలెక్టర్లు […]
మళ్లీ పసిడి ధరలు పైకి ఎగబాకుతున్నాయి.. మొన్నటి వరకు కాస్త దిగివచ్చినట్టు కనిపించిన బంగారం ధరలు.. గురువారం నుంచి మళ్లీ పైకి కదులుతూ.. పసిడి ప్రేమికులు బ్యాడ్ న్యూస్ చెబుతున్నాయి.. బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 పెరిగి రూ.54,820కి చేరితే.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 150 మేర పైకి కదిలి రూ.50,250కి చేరింది.. ఈ రోజు భారతీయ మార్కెట్లలో బంగారం మరియు వెండి […]
విలక్షణ నటుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం ఫిల్మ్నగర్లోని తన నివాసం తుదిశ్వాస విడిచారు. దీంతో.. ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ అకాల మరణంతో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో.. ఆయన బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.. కైకాల మరణ వార్త తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు చివరి సారిగా కైకాల భౌతికకాయాన్ని చూసేందుకు హైదరాబాద్ కు […]