-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
Airbus C295: భారతీయ విమానయాన, రక్షణ రంగాల చరిత్రలో గురువారం ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. దేశంలోనే మొదటిసారిగా తయారైన ‘మేడ్ ఇన్ ఇండియా’ ఎయిర్బస్ సీ295 (Airbus C295) మిలిటరీ రవాణా విమానం తన మొదటి టెస్ట్ ఫ్లైట్ను విజయవంతంగా పూర్తి చేసింది. గుజరాత్లోని వడోదరలో ఉన్న ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) నుంచి ఈ విమానం గాల్లోకి ఎగిరి రికార్డు సృష్టించింది. విమానం తయారైన తర్వాత జరిగే పరీక్షల్లో ఈ టెస్ట్ ఫ్లైట్ అత్యంత కీలకమైనదని ఎయిర్బస్ డిఫెన్స్ సంస్థ సోషల్… -
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
Hindu Rate of Growth: భారతదేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు నిరంతరాయంగా ప్రధానిగా పదవిలో కొనసాగిన ఎన్నికైన నాయకుడిగా నరేంద్ర మోడీ బుధవారం సరికొత్త రికార్డు సృష్టించారు. 1952 సాధారణ ఎన్నికల తర్వాత దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును అధిగమించారు. ఈ చారిత్రాత్మక మైలురాయిని పురస్కరించుకుని నిర్వహించిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రత్యేక సమావేశంలో ప్రధాని మోడీ గత కాంగ్రెస్ ప్రభుత్వాల ఆర్థిక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దశాబ్దాల నుంచి… -
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
Excise Duty: పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ముడి చమురు సరఫరాలో ఏర్పడిన ఈ అంతరాయం నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. దీనివల్ల దేశీయంగా ఇంధన ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్యుడిపై భారాన్ని పెంచుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో ఇంధన సంక్షోభాన్ని నివారించడానికి, ధరలను అదుపులో ఉంచడానికి భారత ప్రభుత్వం ఒక వ్యూహాత్మక, సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఎక్కువ పరిమాణంలో […] -
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
Bangladesh vs Australia: ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా 86 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. వన్డే ఫార్మాట్లో బంగ్లాదేశ్పై ఆసీస్కు గత 21 ఏళ్లలో ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో యువ జట్టుతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, ఆటలోని అన్ని విభాగాల్లోనూ పూర్తిగా విఫలమైంది. ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. […] -
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
Hyderabad: హైదరాబాద్లోని నారాయణగూడ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. మృతులను భువనేశ్వరి (17), సంధ్య (10)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆదివారం ఇంటి సమీపంలోని ఓ దుకాణం నుంచి మామిడి పండ్లు కొనుగోలు చేసి ఇద్దరు తిన్నారు. అనంతరం మరుసటి రోజు నుంచి వారికి వాంతులు, విరోచనాలు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఇద్దరూ రెండు రోజుల వ్యవధిలో మృతి… -
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
CM Revanth Reddy: హైదరాబాద్ను కులీకుతుబ్షా, నిజాంలు విస్తరించారని.. దాంతో నగరానికి ప్రపంచ గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. హైటెక్ సిటీ అంటే నవ్వారు, ఔటర్ రింగు రోడ్డును అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆనాడు అభివృద్ధి జరగొద్దని కుట్రలు కుతంత్రాలు చేశారని.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ (FCDA)ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. FCDA లోగో, వెబ్సైట్ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ ప్రసంగించారు. ఫ్యూచర్ సిటీని రద్దు… -
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
AI Job Fears: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఎంత వేగంగా దూసుకుపోతోందో, అంతేస్థాయిలో ఉద్యోగుల్లో గుబులు పెరుగుతోంది. ఇటీవల నిర్వహించిన రాయిటర్స్/ఇప్సోస్ (Reuters/Ipsos) సర్వే ప్రకారం.. సగానికి పైగా అమెరికన్లు ఏఐ వల్ల తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీని కార్పొరేట్ కంపెనీలు శరవేగంగా అడాప్ట్ చేసుకోవడంపై ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తాజా సర్వే ఫలితాల ప్రకారం.. 53 శాతం మంది అమెరికన్లు ఏఐ వల్ల తమకు లేదా… -
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
Sangareddy: గత నెల 30న సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత హత్య జరిగింది. ఈ కేసును తాజాగా పోలీసులు ఛేదించారు. మొదట భర్త అనిల్ కుమార్ సాహ్, గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు భార్యను అపహరించి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఆర్సీ పురం డివిజన్, SOT బృందాలు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. విచారణలో భర్త అనిల్ కుమార్ సాహ్నే హత్యకు సూత్రధారి అని తేలింది. -
DGP CV Anand: “ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్”.. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
DGP CV Anand: తెలంగాణలో పోలీసింగ్ విధానంలో కీలక మార్పులకు సంకేతాలు ఇస్తూ డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై "ఫ్రెండ్లీ పోలీసింగ్" అనే పేరుతో నేరస్తుల పట్ల సానుభూతి ఉండదని, ప్రజలను గౌరవిస్తాం.. కానీ రౌడీలు, గుండాలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తాజాగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా అంతమైందన్నారు. ఈ నేపథ్యంలో గ్రేహౌండ్స్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గ్రేహౌండ్స్లో పనిచేస్తున్న సిబ్బందిని కొత్త విభాగాలకు బదిలీ చేస్తూ, వారి సేవలను ఇతర కీలక… -
TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
TMC Congress Merger: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) సంక్షోభం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ప్రస్తుతం ఓ అంశం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. "మమతా బెనర్జీ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారా? తన సొంత పార్టీ టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారా?" అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు అనడానికి ఢిల్లీ కారిడార్లలో మారుమోగుతున్న ఈ చర్చలే నిదర్శనం. బెంగాల్లో తన ఎమ్మెల్యేలు,…
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!