NTV WebDesk
Author- NTV Telugu-
దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టు.. బండి సంజయ్ పై హరీష్ రావు ఫైర్
దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టు బండి సంజయ్..హైద్రాబాద్ గల్లీలో కాదని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. ఢీల్లీలో పోరాటం చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చేస్తారని హరీష్ రావు అన్నారు. ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేతలు దొంగ జపం చేస్తున్నారు. దొంగే దొంగ అంటున్నారని అసలు […] -
నల్గొండ జిల్లాలో కిక్కిరిసిన రిజిస్ట్రేషన్ల ఆఫీసులు
తెలంగాణలో త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనుండడంతో వ్యాపారులు, వినియోగదారులు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. నల్గొండ జిల్లాలో కిక్కిరిసి పోయాయి రిజిస్ట్రేషన్ల ఆఫీసులు. గంటల తరబడి రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షించకతప్పడం లేదు. మరో రెండురోజుల తర్వాత ఛార్జీలు భారీగా పెరగడమే ఇందుకు కారణం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుగానే స్లాట్ లు బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. సాధారణ వినియోగదారులు మాత్రం ప్రభుత్వ నిర్ణయం వల్ల స్థలాలు కొనుగోలుచేయడం భారంగా మారుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్నికల సిత్రాలు.. జిలేబీ అమ్ముతున్న మాజీ సీఎం
ఎన్నికలంటే ఓటర్లను ఆకట్టుకోవడం.. వారికి హామీల మీద హామీల గుప్పిస్తూ ఓట్లు వేయించుకోవడం. దేశంలో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఉత్తరాఖండ్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వివిధ పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రజలను ఆకర్షించడానికి నాయకులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్ల పక్కన వుండే వివిధ స్ట్రీట్ ఫుడ్ షాపుల్లో నేతలు హడావిడి చేస్తున్నారు. పానీపురీ, కొబ్బరి బొండాలు, టిఫిన్ సెంటర్లు… ఇలా వేటినీ వదలడం లేదు నేతలు. సామాన్యులతో మమేకమవుతూ వివిధ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నారు. […] -
టుడే ఎన్టీవీ టాప్ న్యూస్
1.కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆయా దేశాలు ఆంక్షలు సడలిస్తూ వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో.. భారతీయులకు గుడ్న్యూస్ చెప్పింది కెనడా సర్కార్.. భారత్ నుంచి నేరుగానైనా లేదా గల్ఫ్/యూరప్/అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది కెనడా.. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాత కట్టడి చర్యల్లో భాగంగా చాలా దేశాలు ఆంక్షల బాటపట్టాయి. 2.ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై కొన్నిచోట్ల అభ్యంతరాలు […] -
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది: రేవంత్ రెడ్డి
317 జీవో కారణంగా మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సంధ్యా తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జేతి రామ్ కుటుంబ సభ్యులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. రాష్టంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. జెత్రం నాయక్ మరణానికి కారణం ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో అన్నారు. Read Also: తెలంగాణ వచ్చినా.. నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు […] -
కన్నడ నుండి తెలుగులోకి ‘బడవ రాస్కెల్’!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డి అనే కీలక పాత్ర పోషించిన కన్నడ నటుడు ధనుంజయ్ హీరోగా నటించిన చిత్రం ‘బడవ రాస్కెల్’. గత యేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా కన్నడంలో చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగులో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తెలుగులో పలు సినిమాలను నిర్మించి, చక్కని గుర్తింపు సంపాదించుకున్న రిజ్వాన్ […] -
గుంటూరు కోవెలమూడి వైసీపీలో డిష్యుం…డిష్యుం
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడి పంచాయతీ సమావేశంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశం వద్దకు వచ్చిన ఒక వర్గానికి చెందిన సర్పంచి భర్త ఆళ్ల శ్రీను. రెండో వర్గానికి చెందిన దాసరి శ్రీశైలం సైతం సమావేశం వద్దకు వెళ్లడం వివాదానికి దారితీసింది. సమావేశానికి బయట వ్యక్తులు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు వార్డు సభ్యులు. దీంతో చెలరేగిన వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. పంచాయతీ బయటకు వచ్చాక రెండు వర్గాల మహిళా వార్దు సభ్యుల […] -
ఈ జనవరి మాసం ‘బంగార్రాజు’దే!
చూస్తుండగానే కొత్త సంవత్సరం మొదటి మాసం గడిచిపోతోంది. 2022కు పాన్ ఇండియా సినిమాలతో శుభారంభం జరుగుతుందని సినీజనం భావించారు కానీ వారి అంచనాలన్నీ తల్లకిందులు చేస్తూ ‘ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్’ వంటి సినిమాల విడుదల వాయిదా పడింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే సంక్రాంతి సీజన్ పూర్తి కాగానే యాభై శాతం ఆక్యుపెన్సీ విధించారు. విడుదలైన సినిమాలకు అనుకున్న రీతిలో ఆదరణ దొరక్కపోవడం, నెలాఖరులో పెద్ద సినిమా ఒక్కటీ విడుదల కాకపోవడంతో మల్టీప్లెక్స్ లతో పాటు సింగిల్ […] -
హిందూ దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలు దారుణం: సోము వీర్రాజు
హిందూ దేవాలయాల వద్ద అన్యమత చిహ్నాలు దారుణం.. వాటిని వెంటనే తొలగించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో తిరుమల స్వామి దేవాలయం వద్ద అన్యమత చిహ్నాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. శతాబ్దాలుగా సంతానం కలగని దంపతులకు ఇక్కడకొచ్చి గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉందన్నారు. Read Also: నేరగాళ్లకు ఏపీ ఫ్రెండ్లీ స్టేట్గా […] -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం… పయ్యావుల డిమాండ్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బూటకపు ప్రకటనలు చేయడాన్ని మంత్రి బుగ్గన కట్టిపెట్టాలన్నారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. మంత్రి బుగ్గన ఇంకెంత కాలం పిట్టకథలతో నెట్టుకొస్తారు..?ఓ రోజు కరోనా కారణంగా ఆదాయం తగ్గిందంటారు.. మరో రోజు కరోనా ఉన్నా ఆదాయం పెంచామంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమెంత..? పెడుతున్న ఖర్చెంత..?మూలధన వ్యయం ఎక్కువగానే ఖర్చు పెట్టామని లెక్కలు చెబుతున్న బుగ్గన.. ఏ ప్రాజెక్టు ఎంతెంత ఖర్చు పెట్టారో చెప్పగలరా..?మరోసారి మాయలెక్కలను […]
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!