ఉద్యోగుల జీతాలకు ఏపీ పెడుతున్న ఖర్చెంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకు భారీగా ఖర్చుపెడుతుంది. దేశంలో ఆరు ప్రధాన రాష్ట్రాల కు సమానంగా ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేస్తోంది. 2020-21లో ఉద్యోగుల కోసం ఏపీ 37,458 కోట్లు ఖర్చు చేసింది. గత ఏడాది 33,102 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. ప్రభుత్వ ఆదాయంలో 36 శాతం ఉద్యోగుల కోసమే ఖర్చుపెడుతోందని ఓ నివేదికలో తేలింది.ప్రభుత్వ మొత్తం ఖర్చులో జీతాలు, పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఇచ్చిన నివేదిక తెలిపింది.
మిగతా రాష్ట్రాల కంటే ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వాటా ఎక్కువగా ఉంది. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం వాటా 21శాతం ఉండగా, ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వాటా 36శాతం ఉంది.పీఆర్సీని అమలు చేస్తే 10వేల కోట్లకు పైగా భారం పడనుంది. ఇప్పటికే జీతాలు, పెన్షన్ల రూపంలో 68,340 కోట్లు ఉద్యోగులకు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా బడ్జట్ లెక్క ప్రకారం నిరర్థక ఖర్చు కింద చూపిస్తారు. ఏ మాత్రం తిరిగిరాని ఖర్చుల కింద 68 వేల కోట్లను ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
Also Read
- Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
పీఆర్సీ విషయంలో ఉద్యోగ నేతల డిమాండ్ కి ప్రభుత్వం తలవొగ్గింది. లేదంటే సమ్మెకు దిగుతామని ప్రకటించారు. కొత్తగా పీఆర్సీ అమలు చేస్తే మరో 10వేల కోట్ల ఖర్చు కలుస్తుందని భావిస్తున్నారు. అన్నీ కలుపుకుంటే 78వేల కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కింద ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంటే, రాబోయే రోజుల్లో ఉద్యోగుల జీతాలకు కూడా ప్రభుత్వం అప్పులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.దేశంలో హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ఖర్చు ఎక్కువగా వుందని ఓ సర్వేలో తేలింది.
11వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం 2018-19లో జీతాలు, పెన్షన్ల కోసం రూ.52,513 కోట్లు ఖర్చు చేశారని సీఎం జగన్ కు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. తాజాగా 2020-21 నాటికి జీతాలు, పెన్షన్ల వ్యయం రూ.67,340 కోట్లకు చేరిందని వివరించారు. ఎస్ ఓ ఆర్ లో నమోదు చేసిన వివరాల ప్రకారం 2018-19లో జీతాలు 84 శాతం ఉంది. గత ఆర్థిక ఏడాది 2020-21లో జీతాలు, పెన్షన్లు ఎస్ఓఆర్ లో 111 శాతానికి చేరింది.
తాజావార్తలు
-
Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
-
Srinivasa Mangapuram: జూలై 30న ‘శ్రీనివాస మంగాపురం’
-
RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
-
Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
ట్రెండింగ్
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల