YSRCP MP Talari Rangaiah: ప్రతిపక్షాలు ఏపీని శ్రీలంకతో పోల్చడం మానుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ysrcp mp talari rangaiah comments about debts in ap government: ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అప్పుల కారణంగా ఏపీ మరో శ్రీలంక కాబోతుందని ప్రచారం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీలు తాజాగా ఖండించారు. ఈ మేరకు ఢిల్లీలో వైసీపీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. ఏపీలో అవినీతి లేని పాలనను జగన్ ప్రజలకు అందిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలకు వందకు వంద రూపాయలు నేరుగా చేరుతున్నాయని… మధ్యవర్తులకు, దళారులకు, అవినీతికి తావు లేదన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసి దుబారా చేసిందని.. తాము అప్పు తెచ్చిన ప్రతి పైసాను సద్వినియోగం చేస్తున్నామని ఎంపీ తలారి రంగయ్య వివరించారు. ప్రతి ఉరిలో అభివృద్ధికి చిహ్నాలుగా గ్రామ సచివాలయాలు కన్పిస్తున్నాయని.. ప్రతిపక్షాలు అనవసర దుష్ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.
Read Also: New Judges to AP High Court: ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం
Also Read
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
శ్రీలంకతో ఒక రాష్ట్రాన్ని పోల్చి చూడడం తగదని వైసీపీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. దేశం 133 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాలకు నీతులు చెప్పడం తగదన్నారు. జీడీపీలో కేంద్రం 59 శాతం అప్పు చేస్తే.. ఏపీ 32.4 శాతం అప్పు మాత్రమే చేసిందన్నారు. శ్రీలంక దేశం జీడీపీలో 101 శాతం అప్పు చేసిందని గుర్తుచేశారు. ఏపీలో పేదలకు సంక్షేమ పథకాల రూపంలో ఆర్ధిక తోడ్పాటు లభిస్తుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ తరహాలో నేరుగా లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం లభించడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ తలారి రంగయ్య అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల
-
Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
-
Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
-
MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్