Adimulapu Suresh: సింహం సింగిల్ గానే.. వైసీపీ ఒంటరిగానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో పోటీపై.. పొత్తులపై ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చర్చ హాట్ హాట్గా సాగుతోంది.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయా? లేక టీడీపీ, జనసేన మైత్రితో ముందుకు వెళ్తాయా? లెఫ్ట్ పార్టీలు ఎటువైపు.. అనే చర్చ సాగుతోంది.. అయితే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. మరోసారి సింగిల్గానే బరిలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.. సింహం సింగిల్ గానే వస్తుంది.. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని వ్యాఖ్యానించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రానున్న ఎన్నికల్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Naga Chaitanya: ‘కస్టడీ’ నుంచి బయటపడ్డ నాగచైతన్య..
Also Read
ఇక, ఏపీలో శాంతి భద్రతల పేరిట టీడీపీ నానా రాద్దాంతం చేయాలని చూస్తోందని ఫైర్ అయ్యారు మంత్రి సురేష్.. ప్రజలను మీడియాను అడ్డుపెట్టుకుని మభ్యపెట్టాలని తెలుగుదేశం పార్టీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు.. మరోవైపు.. గతంలో టీడీపీ.. ఎంపీ సీట్లను అమ్ముకునే వారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కల్లబొల్లి మాటలతో ఇప్పటికీ టీడీపీ మభ్యపెట్టాలని చూస్తోంది.. ప్రభుత్వం సామాజిక సాధికారత దిశగా అడుగులు ముందుకు వేస్తోందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. కాగా, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం స్థానాల్లో విజయం టార్గెట్గా పెట్టుకుంది వైసీపీ.. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తోన్న సీఎం జగన్.. అంతా కలిసి విజయం కోసం పనిచేయాలని పిలుపునిస్తున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!