Site icon NTV Telugu

వైఎస్‌ వివేకా హత్య కేసు.. సీబీఐని కలిసిన వివేకా కుమార్తె సునీత

Sunitha

Sunitha

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దూకుడు పెంచింది సీబీఐ… వివేకా హత్య కేసు అనుమానితులు మరోసారి హాజరయ్యారు.. ఇవాళ మరోమారు విచారణకు హాజరయ్యారు ఉదయ్ కుమార్ రెడ్డి, ఇనయతుల్లా, రంగన్న, ప్రకాష్ రెడ్డి, వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు శివ ప్రకాష్.. పలుమార్లు వివిధ కోణాల్లో వీరిని విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. మరోవైపు.. సీబీఐ అధికారులను కలిశారు వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్.. ఇవాళ పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌ వెళ్లిన ఇద్దరూ.. సీబీఐ అధికారులను కలిసి అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా, వాచ్‌మన్‌ రంగన్న నోరు తెరిచన తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవడం.. అరెస్ట్‌ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Exit mobile version