YS Jagan: జంతర్ మంతర్ దగ్గర వైఎస్ జగన్ ధర్నా.. సంఘీభావం ప్రకటించిన అఖిలేష్ యాదవ్..!
- ఢిల్లీలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ధర్నా..
- ఏపీలో జరుగుతున్న దాడులపై జంతర్ మంతర్ దగ్గర నిరసన..
- వైఎస్ జగన్ కు సంఘీభావం ప్రకటించిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులు, హింసాత్మాక ఘటనలపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే, వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చారు.. ఆయనతో కలిసి ధర్నాలో కూర్చోని సంఘీభావం ప్రకటించారు.
Read Also: Nepal : నేపాల్లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూలిన విమానం
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ఇక, మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు అని తెలిపారు. నారా లోకేష్ రెడ్ బుక్ చూపిస్తున్నారు.. ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు మొన్న మేము అధికారంలో ఉన్నాము.. రేపు మళ్ళీ మేం అధికారంలోకి వస్తామన్నారు. మేము ఎప్పుడు దాడులను ప్రోత్సహించలేదు.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసాన్ని మేము ప్రోత్సహించ లేదని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలపై బహిరంగ దాడులు చేస్తున్నారు.. కార్పొరేటర్లపై దాడులకు దిగుతున్నారు.. బాధితులపై దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారు.. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు ఇతర పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, టీడీపీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 30 మందిని చంపారు.. లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని నచ్చని వారిపై దాడి చేస్తున్నారు.. దాడులు, దౌర్జన్యాను కొనసాగిస్తున్నారు.. రాష్ట్రంలో ఇంతకీ ప్రజాస్వామ్యం ఉందాని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. భయంతో జనం వలస వెళ్తున్నారు అని వైఎస్ జగన్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్ను చూడలేకపోతున్నారు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్లో దీని ధర ఎంతో తెలుసా..?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!