YS Jagan: జంతర్ మంతర్ దగ్గర వైఎస్ జగన్ ధర్నా.. సంఘీభావం ప్రకటించిన అఖిలేష్ యాదవ్..!
- ఢిల్లీలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ధర్నా..
- ఏపీలో జరుగుతున్న దాడులపై జంతర్ మంతర్ దగ్గర నిరసన..
- వైఎస్ జగన్ కు సంఘీభావం ప్రకటించిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులు, హింసాత్మాక ఘటనలపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే, వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చారు.. ఆయనతో కలిసి ధర్నాలో కూర్చోని సంఘీభావం ప్రకటించారు.
Read Also: Nepal : నేపాల్లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూలిన విమానం
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
ఇక, మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు అని తెలిపారు. నారా లోకేష్ రెడ్ బుక్ చూపిస్తున్నారు.. ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు మొన్న మేము అధికారంలో ఉన్నాము.. రేపు మళ్ళీ మేం అధికారంలోకి వస్తామన్నారు. మేము ఎప్పుడు దాడులను ప్రోత్సహించలేదు.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసాన్ని మేము ప్రోత్సహించ లేదని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలపై బహిరంగ దాడులు చేస్తున్నారు.. కార్పొరేటర్లపై దాడులకు దిగుతున్నారు.. బాధితులపై దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారు.. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు ఇతర పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, టీడీపీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 30 మందిని చంపారు.. లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని నచ్చని వారిపై దాడి చేస్తున్నారు.. దాడులు, దౌర్జన్యాను కొనసాగిస్తున్నారు.. రాష్ట్రంలో ఇంతకీ ప్రజాస్వామ్యం ఉందాని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. భయంతో జనం వలస వెళ్తున్నారు అని వైఎస్ జగన్ ఆరోపించారు.
తాజావార్తలు
-
NPS Sanchay Yojana: NPS సంచయ్ యోజన.. ఖాతా ఎలా తెరవాలి? ఎవరికీ ఉపయోగం? పూర్తి వివరాలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!