YS Jagan: జంతర్ మంతర్ దగ్గర వైఎస్ జగన్ ధర్నా.. సంఘీభావం ప్రకటించిన అఖిలేష్ యాదవ్..!
- ఢిల్లీలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ధర్నా..
- ఏపీలో జరుగుతున్న దాడులపై జంతర్ మంతర్ దగ్గర నిరసన..
- వైఎస్ జగన్ కు సంఘీభావం ప్రకటించిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న దాడులు, హింసాత్మాక ఘటనలపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే, వైఎస్ జగన్ చేస్తున్న ధర్నాకు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చారు.. ఆయనతో కలిసి ధర్నాలో కూర్చోని సంఘీభావం ప్రకటించారు.
Read Also: Nepal : నేపాల్లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూలిన విమానం
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
ఇక, మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు అని తెలిపారు. నారా లోకేష్ రెడ్ బుక్ చూపిస్తున్నారు.. ఇవాళ వారు అధికారంలోకి వచ్చారు మొన్న మేము అధికారంలో ఉన్నాము.. రేపు మళ్ళీ మేం అధికారంలోకి వస్తామన్నారు. మేము ఎప్పుడు దాడులను ప్రోత్సహించలేదు.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసాన్ని మేము ప్రోత్సహించ లేదని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలపై బహిరంగ దాడులు చేస్తున్నారు.. కార్పొరేటర్లపై దాడులకు దిగుతున్నారు.. బాధితులపై దౌర్జన్యంగా కేసులు పెడుతున్నారు.. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనకు ఇతర పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే, టీడీపీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 30 మందిని చంపారు.. లోకేష్ రెడ్ బుక్ పెట్టుకొని నచ్చని వారిపై దాడి చేస్తున్నారు.. దాడులు, దౌర్జన్యాను కొనసాగిస్తున్నారు.. రాష్ట్రంలో ఇంతకీ ప్రజాస్వామ్యం ఉందాని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. భయంతో జనం వలస వెళ్తున్నారు అని వైఎస్ జగన్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?