YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు..
- రేపల్లెపై జగన్ ప్రత్యేక ఫోకస్
- యువ నాయకుడు మోహన్పై ప్రశంసలు
- శ్రీనుకు కీలక హామీ ఇచ్చిన జగన్
- కార్యకర్తలే పార్టీకి అసలైన బలం: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో శ్రీనివాసరావు వైసీపీ పార్టీలో చేరారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో శ్రీనివాసరావుకు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రేపల్లె నియోజకవర్గ రాజకీయాలపై , పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపల్లె నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన జగన్, అక్కడ మోహన్ అనే యువకుడి పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. మోహన్ ఎంతో ఉత్సాహవంతుడని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడని జగన్ కొనియాడారు. యువత రాజకీయాల్లోకి రావడం పార్టీకి కొత్త జవజీవాలను ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా శ్రీను పాత్రను జగన్ ప్రస్తావిస్తూ, మోహన్ను తన సొంత తమ్ముడిగా భావించి అతని గెలుపు కోసం శ్రీను కృషి చేస్తున్న తీరును అభినందించారు. శ్రీను స్వయంగా మోహన్ గెలుపు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడని, ఈ ప్రయాణంలో తాను కూడా శ్రీనుకు తోడుగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్రీను కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుందని, అతనికి గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగిస్తానని జగన్ స్పష్టం చేశారు.
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
సమావేశానికి భారీగా తరలివచ్చిన ప్రజలు, నాయకులు , కార్యకర్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ, అందరినీ వ్యక్తిగతంగా కలవడం సాధ్యం కాకపోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అవకాశం ఉన్నప్పుడల్లా క్షేత్రస్థాయి కార్యకర్తలను తన వద్దకు తీసుకురావాలని శ్రీను, మోహన్లకు సూచించారు. తన మీద నమ్మకం ఉంచి పార్టీ విజయం కోసం పగలు రేయి కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు, సోదరులకు, అక్కాచెల్లెమ్మలకు , పెద్దలకు జగన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?