YS Jagan : వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు.. రేపల్లె బాధ్యత మనదే.. కార్యకర్తలే నా బలం
- వైసీపీలోకి మోపిదేవి శ్రీనివాసరావు..
- రేపల్లెపై జగన్ ప్రత్యేక ఫోకస్
- యువ నాయకుడు మోహన్పై ప్రశంసలు
- శ్రీనుకు కీలక హామీ ఇచ్చిన జగన్
- కార్యకర్తలే పార్టీకి అసలైన బలం: వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో శ్రీనివాసరావు వైసీపీ పార్టీలో చేరారు. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో శ్రీనివాసరావుకు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రేపల్లె నియోజకవర్గ రాజకీయాలపై , పార్టీ భవిష్యత్ కార్యాచరణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపల్లె నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన జగన్, అక్కడ మోహన్ అనే యువకుడి పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. మోహన్ ఎంతో ఉత్సాహవంతుడని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడని జగన్ కొనియాడారు. యువత రాజకీయాల్లోకి రావడం పార్టీకి కొత్త జవజీవాలను ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా శ్రీను పాత్రను జగన్ ప్రస్తావిస్తూ, మోహన్ను తన సొంత తమ్ముడిగా భావించి అతని గెలుపు కోసం శ్రీను కృషి చేస్తున్న తీరును అభినందించారు. శ్రీను స్వయంగా మోహన్ గెలుపు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడని, ఈ ప్రయాణంలో తాను కూడా శ్రీనుకు తోడుగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్రీను కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుందని, అతనికి గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగిస్తానని జగన్ స్పష్టం చేశారు.
Also Read
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
సమావేశానికి భారీగా తరలివచ్చిన ప్రజలు, నాయకులు , కార్యకర్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ, అందరినీ వ్యక్తిగతంగా కలవడం సాధ్యం కాకపోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అవకాశం ఉన్నప్పుడల్లా క్షేత్రస్థాయి కార్యకర్తలను తన వద్దకు తీసుకురావాలని శ్రీను, మోహన్లకు సూచించారు. తన మీద నమ్మకం ఉంచి పార్టీ విజయం కోసం పగలు రేయి కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు, సోదరులకు, అక్కాచెల్లెమ్మలకు , పెద్దలకు జగన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
-
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
-
Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..