YS Jagan : 1100 కోట్లు గంగలో పోసినట్టేనా..? అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ సంచలన లెక్కలు..!
- అమరావతి టవర్ల వ్యయంపై జగన్ సంచలన ఆరోపణలు
- రూ.1100 కోట్ల తాత్కాలిక భవనాలపై విమర్శలు
- చదరపు అడుగు ఖర్చుపై గణాంకాలతో ప్రశ్నించిన జగన్
- పార్లమెంట్, సెక్రటేరియట్తో పోల్చి ప్రభుత్వాన్ని నిలదీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐదు కీలక టవర్ల నిర్మాణ వ్యయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ పేరుతో రూ. 1,100 కోట్లు ఖర్చు చేసి, ఇప్పుడు వాటిని పక్కన పెట్టి మళ్ళీ కొత్త నిర్మాణాల పేరుతో అంచనాలను భారీగా పెంచి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాత్కాలిక భవనాల కోసం ఖర్చు చేసిన ఆ నిధులన్నీ ఇప్పుడు గంగలో పోసినట్టేనని ఆయన మండిపడ్డారు.
Airtel Rs 48 Plan : ఎయిర్టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. ఈ ఆఫర్ తెలిస్తే యూజర్లు అస్సలు వదలరు!
Also Read
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
రాజధానిలో నిర్మిస్తున్న ఐదు టవర్ల వ్యయంపై జగన్ గణాంకాలతో సహా విరుచుకుపడ్డారు. మొదట ఈ టవర్లకు రూ. 4,354 కోట్లకు కాంట్రాక్టులు ఇస్తే, మళ్ళీ ఏసీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వంటి పనుల కోసం అదనంగా రూ. 2,316 కోట్లకు టెండర్లు పిలుస్తున్నారని, వీటికి తోడు డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కోసం మరో రూ. 1,053 కోట్లు కేటాయించారని తెలిపారు. మొత్తం 52.20 లక్షల చదరపు అడుగుల వైశాల్యానికి గాను, ఒక్కో స్క్వేర్ ఫీట్కు సగటున రూ. 14,795 ఖర్చవుతోందని, హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి నగరాల్లో అత్యుత్తమ నిర్మాణాలకే రూ. 4,500 కంటే ఎక్కువ ఖర్చు కాదని ఆయన గుర్తు చేశారు. ఉచిత ఇసుక వంటి మినహాయింపులు ఉన్నప్పటికీ ఇంత భారీ రేట్లు ఉండటం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు.
అమరావతి ఖర్చు ఎంత విపరీతంగా ఉందో చెప్పడానికి జగన్ కొన్ని జాతీయ స్థాయి ఉదాహరణలను ఉటంకించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన అత్యాధునిక సెక్రటేరియట్ భవనానికి కేవలం రూ. 615 కోట్లు మాత్రమే ఖర్చయ్యిందని, అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ప్రతిష్టాత్మక కొత్త పార్లమెంట్ భవనం వ్యయం కూడా కేవలం రూ. 970 కోట్లు మాత్రమేనని ఆయన వివరించారు. ఒకవైపు పార్లమెంట్ , పొరుగు రాష్ట్ర సెక్రటేరియట్ వెయ్యి కోట్ల లోపు పూర్తవుతుంటే, ఏపీలో మాత్రం ఐదు టవర్లకే వేల కోట్లు ఖర్చు చేయడం వెనుక ఉన్న మర్మమేమిటని జగన్ ప్రశ్నించారు. ఈ అంకెల గారడీపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!