ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు: యరపతినేని శ్రీనివాసరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాచేపల్లి, గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసింద న్నారు. నామినేషన్లు అడ్డుకొని పరిశీలనలో తొలగించడం, అభ్యర్థు లను కిడ్నాప్ చేయాలని చూడటం, పోలింగ్ బూత్లను ఆక్రమించు కోవాలని చూడటం ఇవన్నీ ఏంటని ఆయన ప్రశ్నించారు. జంగ మహేశ్వరపురంలో నామినేషన్స్ వేయకుండా అడ్డుకున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలానే ఉపయోగిం చారంటూ యరపతినేని వైసీపీపై మండిపడ్డారు.
ఓటర్లకు రక్షణ కల్పించమని కోర్టు ఆదేశించినప్పటికీ, కొంతమంది పోలీస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. వైసీపీకి సహకరించిన పోలీస్ అధికారులపై కోర్టుకు వెళ్తామన్నారు.టీడీపీ మాజీ సర్పంచ్ తంగెళ్ళ శ్రీనివాస రావుపై వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి భర్త మునగా పున్నారావు అకారణంగా దాడి చేశారని, ఇది హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బరి తెగించారన్నారు.టీడీపీ అసలు పోటీలోనే ఉండకూడదని వైసీపీ నేతలు అనుకుంటున్నారన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఈ ఎన్నికల్లో ధైర్యంగా పోరాడారని, వైసీపీ వారు గెలిచే దమ్ము లేనందునే దౌర్జన్యాలకు పాల్పడ్డారని యరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు.
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్నెస్ లేని బస్సులు!
తాజావార్తలు
-
IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!
-
New Bat Coronavirus: థాయ్లాండ్లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
-
Biggest Disaster : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్.. బడ్జెట్ రూ. 1400 కోట్లు.. కలెక్షన్స్ రూ. 6 కోట్లు
-
Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!
-
Sai Pallavi: ‘ఏక్ దిన్’ డిజాస్టర్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..