Vijaya Sai Reddy: టిక్కెట్ రేట్లపై ఇప్పుడు చంద్రబాబు నోరు మూగబోయిందా?
సోషల్ మీడియాలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్గా ఉంటారు. నిత్యం ఆయన ప్రధాన ప్రతిపక్షం టీడీపీని విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల సినిమా టిక్కెట్ రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో టిక్కెట్ రేట్లు ఎందుకు పెంచరంటూ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయగా.. ఇప్పుడు టిక్కెట్ రేట్లు పెంచాక ఆయన ఎందుకు స్పందించడం లేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
‘సినిమా టికెట్ల రేట్లపై ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించింది. జీవో కూడా ఇచ్చింది. మొన్నటి వరకు టికెట్ రేట్లపై గొంతు చించుకున్న చంద్రబాబు నోరు ఇప్పుడు మూగబోయింది. బహుశా ఇంకో ఏడాదికో, ఎప్పుడో కొత్త మూవీ వచ్చే వరకు ఇంతేనేమో. ఇక హీరోలే లేనట్టు, వారివి సినిమాలే కానట్టు’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాకు తప్ప చంద్రబాబు ఇతర హీరోల సినిమాల టిక్కెట్ రేట్లపై స్పందించరా అంటూ విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శలు చేసినట్లు అర్ధమవుతోంది.
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
సినిమా టికెట్ల రేట్లపై ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించింది. జీఓ కూడా ఇచ్చింది. మొన్నటి వరకు టికెట్ రేట్లపై గొంతు చించుకున్న చంద్రబాబు నోరు ఇప్పుడు మూగబోయింది. బహుశా ఇంకో ఏడాదికో, ఎప్పుడో కొత్త మూవీ వచ్చే వరకు ఇంతేనేమో. ఇక హీరోలే లేనట్టు, వారివి సినిమాలే కానట్టు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 10, 2022
మరోవైపు బడ్జెట్పై టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు చేయడంపైనా ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు లోకేష్ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘మోసకారి బడ్జెట్ అంటూ మాలోకం ‘వీరంగం’ చేస్తున్నాడు. మహామోసకారి ఎవరో గూగుల్లో కొట్టి చూడు. మీ తండ్రి పేరే కనిపిస్తుంది. అమ్మఒడి, వాహనమిత్ర, విద్యాదీవెన లబ్దిదారులను ఎప్పుడైనా కలిశావా చిట్టినాయుడూ? ఏ స్కీంనైనా అధ్యయనం చేశావా? మందబుద్ధితో కేటాయింపులపై మాట్లడటమేంటి చిట్టీ?’ అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
మోసకారి బడ్జెట్ అంటూ ‘వీరంగం’ చేస్తున్నాడు మాలోకం. మహామోసకారి ఎవరో గూగుల్ లో కొట్టి చూడు. మీ తండ్రి పేరే కనిపిస్తుంది. అమ్మఒడి, వాహనమిత్ర, విద్యాదీవెన లబ్దిదారులను ఎప్పుడైనా కలిశావా చిట్టినాయుడూ? ఏ స్కీంనైనా అధ్యయనం చేశావా? మందబుద్ధితో కేటాయింపులపై మాట్లడటమేంటి చిట్టీ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 11, 2022
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!