Vijaya Sai Reddy: టిక్కెట్ రేట్లపై ఇప్పుడు చంద్రబాబు నోరు మూగబోయిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్గా ఉంటారు. నిత్యం ఆయన ప్రధాన ప్రతిపక్షం టీడీపీని విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల సినిమా టిక్కెట్ రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో టిక్కెట్ రేట్లు ఎందుకు పెంచరంటూ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయగా.. ఇప్పుడు టిక్కెట్ రేట్లు పెంచాక ఆయన ఎందుకు స్పందించడం లేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
‘సినిమా టికెట్ల రేట్లపై ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించింది. జీవో కూడా ఇచ్చింది. మొన్నటి వరకు టికెట్ రేట్లపై గొంతు చించుకున్న చంద్రబాబు నోరు ఇప్పుడు మూగబోయింది. బహుశా ఇంకో ఏడాదికో, ఎప్పుడో కొత్త మూవీ వచ్చే వరకు ఇంతేనేమో. ఇక హీరోలే లేనట్టు, వారివి సినిమాలే కానట్టు’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాకు తప్ప చంద్రబాబు ఇతర హీరోల సినిమాల టిక్కెట్ రేట్లపై స్పందించరా అంటూ విజయసాయిరెడ్డి పరోక్షంగా విమర్శలు చేసినట్లు అర్ధమవుతోంది.
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సినిమా టికెట్ల రేట్లపై ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటించింది. జీఓ కూడా ఇచ్చింది. మొన్నటి వరకు టికెట్ రేట్లపై గొంతు చించుకున్న చంద్రబాబు నోరు ఇప్పుడు మూగబోయింది. బహుశా ఇంకో ఏడాదికో, ఎప్పుడో కొత్త మూవీ వచ్చే వరకు ఇంతేనేమో. ఇక హీరోలే లేనట్టు, వారివి సినిమాలే కానట్టు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 10, 2022
మరోవైపు బడ్జెట్పై టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు చేయడంపైనా ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు లోకేష్ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘మోసకారి బడ్జెట్ అంటూ మాలోకం ‘వీరంగం’ చేస్తున్నాడు. మహామోసకారి ఎవరో గూగుల్లో కొట్టి చూడు. మీ తండ్రి పేరే కనిపిస్తుంది. అమ్మఒడి, వాహనమిత్ర, విద్యాదీవెన లబ్దిదారులను ఎప్పుడైనా కలిశావా చిట్టినాయుడూ? ఏ స్కీంనైనా అధ్యయనం చేశావా? మందబుద్ధితో కేటాయింపులపై మాట్లడటమేంటి చిట్టీ?’ అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
మోసకారి బడ్జెట్ అంటూ ‘వీరంగం’ చేస్తున్నాడు మాలోకం. మహామోసకారి ఎవరో గూగుల్ లో కొట్టి చూడు. మీ తండ్రి పేరే కనిపిస్తుంది. అమ్మఒడి, వాహనమిత్ర, విద్యాదీవెన లబ్దిదారులను ఎప్పుడైనా కలిశావా చిట్టినాయుడూ? ఏ స్కీంనైనా అధ్యయనం చేశావా? మందబుద్ధితో కేటాయింపులపై మాట్లడటమేంటి చిట్టీ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 11, 2022
తాజావార్తలు
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!