డెడ్ బాడీ కనిపిస్తే లోకేష్ రాబందులాగా వాలిపోతాడు. బూతులు తిడుతుంటే హీరో అయిపోతాను అనుకుంటున్నాడు అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. పిచ్చి వర్కవుట్ లు చేసి బాడీ వెయిట్ తో పాటు బుర్ర వెయిట్ కూడా తగ్గింది అని పేర్కొన్నారు. లోకేష్ కు తన తండ్రి హయాంలో దళితుల పై జరిగిన దాడుల సంగతి తెలుసా… కారంచేడు సంఘటన ఎవరి హయాంలో జరిగిందో లోకేష్ తెలుసుకోవాలి అని సూచించారు. నేరస్తుడు ఎలాంటి వ్యక్తి అయినా కఠిన శిక్ష వేయటం ఖాయం అని తెలిపిన ఆయన లోకేష్ బుర్రతక్కువ వ్యక్తి, పరమశుంఠ అన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చంద్రబాబు చెప్పిన మాటలు ప్రజలు మరిచిపోలేదు. మీడియా ప్రెస్ మీట్ పెట్టడాని కంటే ముందు లోకేష్ ఆనందంతో వెకిలి నవ్వులకు పాల్పడ్డాడు అని తెలిపారు.