చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడికి విహార యాత్రకు వస్తున్నారు అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ప్రజలు వీళ్ళను రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులుగా భావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ఓట్లు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. జగన్ ఓటు పులివెందులలో ఉంది. ఇక బద్వేల్ ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయ్యింది అని తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా చంద్రబాబు ఉత్తరాంధ్ర, సీమ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. పాదయాత్రలో పాల్గొన్న వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఆ బాధ్యత చంద్రబాబుదే. అమరావతి రైతులుగా చెప్పుకుంటున్న వారు చంద్రబాబు బినామీలు అన్నారు. ఇక చంద్రబాబు రాష్ట్ర ప్రజల పై నాగుపాములా పగబట్టాడు. ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బానిసత్వం వహిస్తున్నాడు అని పేర్కొన్నారు.