Anantapur: వామ్మో.. వీళ్ళు లేడీలు కాదు కేడీలు.. పెళ్ళి షాపింగ్ అని లక్షల విలువైన చీరలతో పరార్
Anantapur: దుకాణం నడుపుతున్నారా.. అయితే తస్మాత్ జగ్రత్త.. షాపింగ్ అంటూ వచ్చి దుకాణంలో ఉన్న విలువైన వస్తువులను కాజేసి ఉడాయిస్తున్నారు. ఈ మాట ఇప్పుడు చెప్పడానికి కారణం.. సాధారణంగా దొంగతనాలు ఎవరు లేని సమయం లోనో.. రాత్రి సమయం లోనో జరుగుతుంటాయి. కానీ షాపింగ్ అంటూ వచ్చిన విలువైన చీరలతో ఉడాయించారు కొందరు మహిళలు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. అనంతపురం జిల్లా లోని నార్పల మండలం లోని కేశేపల్లిలో కొందరు లేడీలు కేడీలు గా మారారు. పెళ్ళి కుదిరిందని చీరలు కావాలంటూ కొందరు మహిళలు ఓ షాప్ కి వెళ్లారు. అయితే ఆ షాప్ లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. దీనితో ఆ మహిళలు అక్కడ వాళ్ళ చేతి వాటం చూపించడానికి వెనకడుగు వేశారు.
Read also:Bigg Boss Telugu 7 : ఫినాలే రేస్.. అదరగొట్టిన రైతుబిడ్డ.. అమర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న యావర్..
Also Read
- Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
- Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
కాగా ఆ షాప్ పక్కనే కేశవ అతని భార్య వాళ్ళ ఇంటిని దుకాణంగా మార్చారు. ఆ దుకాణానికి శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి సిల్క్స్ అనే పేరు పెట్టి బట్టలు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళలు కేశవ దంపతులు నడుపుతున్న దుకాణానికి వెళ్లారు. పెళ్ళి ఉంది.. చీరలు కొనడానికి వచ్చామని.. ఖరీదైన పట్టు చీరలు కావాలి చూపించమన్నారు ఆ మహిళలు.. ఈ నేపథ్యంలో విలువైన చీరలను ఆ మహిళలకు చూపించారు దుకాణదారులు. చీరలు చూస్తున్న మహిళల్లో ఓ మహిళ కాస్త మనిషి నీళ్లు ఇవ్వాల్సిందిగా దుకాణదారులని అడిగింది. ఈ నేపథ్యంలో నీళ్ళని తీసుకు రావడానికి లోపలకి వెళ్లారు దుకాణదారులు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న మహిళలు చేతి వాటం చూపించారు.. లక్షా యాభైవేల ఖరీదైన చీరలతో అక్కడ నుడి ఉడాయించారు.
Read also:UP: టాయిలెట్ వస్తోంది.. ఆపమంటే కండక్టర్ బస్సు నుంచి తోసేశాడు.. కూలీ దుర్మరణం
నీళ్ల కోసం వెళ్లిన వ్యక్తి తిరిగొచ్చే సరికి అక్కడ మహిళలు లేరు. ఖరీదైన చీరలు లేవు. దీనితో వచ్చింది లేడీలు కాదు కేడీలు అని గ్రహించిన దుకాణం యజమానులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ముందుగా వెళ్లిన షాప్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా లేడీ కిలాడీల కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!